News January 8, 2025

ADB: బ్యాంకర్ల వేధింపు.. రైతు ఆత్మహత్య

image

బ్యాంకర్ల వేధింపులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిర్పూర్ మండలంలో చోటుచేసుకుంది. SI కమలాకర్ కథనం ప్రకారం.. శివపూర్‌కు చెందిన సంతోష్ ఓ బ్యాంకులో రుణం తీసుకున్నారు. రుణం చెల్లించకుంటే ఇంటికి తాళం వేస్తామని బ్యాంక్ అధికారులు ఇంటికొచ్చి బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన రైతు మంగళవారం సాయంత్రం పురుగులమందు తాగారు. బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 18, 2025

సారంగాపూర్: చిరుత పులి దాడిలో లేగదూడ మృతి

image

సారంగాపూర్ మండలంలోని ఆదివాసీ తండా, దుప్యతండాల మధ్య అటవీ క్షేత్రం సమీపంలో చిరుత దాడిలో రైతు జాదవ్ ప్రేమ్‌కుమార్ చెందిన లేగదూడ మృతి చెందినట్లు అటవీ ఉప క్షేత్ర అధికారి నజీర్ ఖాన్ తెలిపారు. రైతు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకొని శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లేగదూడ మృతదేహానికి పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. ఆయన వెంట ఎఫ్‌బీఓలు సుజాత, వెన్నెల తదితరులు ఉన్నారు.

News January 18, 2025

ADB: ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. APPLY NOW

image

రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధిస్ట్, పార్శి అభ్యర్థులకు గ్రూప్-1,2,3,4, RRB, SSC, బ్యాంకింగ్ మొదలైన పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆదిలాబాద్ DMWO రాజలింగు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 15 లోపల మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.  నాలుగు నెలల బేసిక్ ఫౌండేషన్ కోర్సు ఇస్తామని.. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 18, 2025

ADB: కాంగ్రెస్ గెలుపునకు సమన్వయంతో పనిచేయాలి: సీతక్క

image

ఇచ్చోడ మండలంలోని స్థానిక గార్డెన్‌లో మంత్రి సీతక్క అధ్యక్షతన జిల్లా ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం రాత్రి నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో కలిసి కట్టుగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సీతక్క సూచించారు.