News March 6, 2025

ADB: మందు తాగిన దంపతులు.. భర్త మృతి

image

నేరడిగొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడూర్‌ గ్రామానికి చెందిన రైతు ఈదపు పోశెట్టి (60), అతడి భార్య ఇందిర(52) అప్పుల బాధ భరించలేక గురువారం పురుగు మందు తాగారు. ఈ ఘటనలో పోశెట్టి మృతి చెందగా ఇందిర పరిస్థితి విషమంగా ఉంది. పంట సాగులో నష్టం రావడం, ఇద్దరు పిల్లలకు పెళ్లి చేయడంతో అప్పులు అయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News October 24, 2025

నల్గొండ: 154 వైన్ షాపులకు 4,905 దరఖాస్తులు

image

నల్గొండ జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని 154 వైన్ షాపుల కోసం మొత్తం 4,905 టెండర్లు దాఖలయ్యాయి. ఇందులో నల్గొండ డివిజన్‌లో అత్యధికంగా 1,417, మిర్యాలగూడలో 988, దేవరకొండలో 621, హాలియాలో 509, నకిరేకల్‌లో 512, చండూరులో 398 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

News October 24, 2025

ఆదిలాబాద్: పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్‌ విడుదల

image

పదో తరగతి ఫైనల్‌ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రకటించిందని DEO ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. అక్టోబరు 30 నుంచి నవంబర్‌ 13 లోపు పాఠశాల హెడ్‌మాస్టర్లకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. HMలు ఆన్‌లైన్‌ ద్వారా నవంబర్‌ 14 లోపు ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డేటాను నవంబర్‌ 18లోపు అందించాలని సూచించారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్‌ 29 వరకు అవకాశం ఉందన్నారు.

News October 24, 2025

పెండింగ్ కేసులు పరిష్కరించాలి: MHBD ఎస్పీ

image

మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పోలీస్ అధికారులతో క్రైమ్ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన క్రిమినల్ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. పెండింగ్లో ఉన్న కేసులు, మహిళల భద్రత, సైబర్ నేరాలు, అక్రమ రవాణాలు, గంజాయి నియంత్రణ చర్యలు, ప్రజాశాంతి భద్రత అంశాలపై సమగ్రంగా చర్చించారు. కేసులు పెండింగ్లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు.