News March 16, 2025
ADB: మద్యం మత్తులో ఒకరు.. ఉరేసుకొని ఇద్దరు సూసైడ్

ADB, NRML జిల్లాల్లో ముగ్గురు సూసైడ్ చేసుకోవడంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇంద్రవెల్లి మండలం బుర్సాన్పటర్ గ్రామానికి చెందిన విద్యాసాగర్(57) మద్యం మత్తులో చేనుకు వెళ్లి పురుగుమందు తాగాడు. బజార్హత్నూర్ మండలం రాంగనగర్కు చెందిన గంగారం(54) మద్యానికి బానిసయ్యారు. శనివారం తన పొలానికి వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. కడెం మండలం మొర్రిగూడెంనకు చెందిన సత్తెన్న ఒంటరిజీవితం భరించలేక ఉరేసుకున్నాడు.
Similar News
News December 13, 2025
స్టార్ ఫ్రూట్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్!

వింటర్ సీజన్లో లభించే స్టార్ ఫ్రూట్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ‘వీటిల్లోని విటమిన్-B6 శరీర జీవక్రియను మెరుగుపరిచి కేలరీలు కరిగేలా చేస్తుంది. మెదడు పనితీరును పెంచి, మానసిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్-C ఇమ్యూనిటీని పెంచి దగ్గు, జలుబు సమస్యలను తగ్గిస్తుంది. అధికంగా ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్-A కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది’ అని వైద్యులు చెబుతున్నారు.
News December 13, 2025
హెల్మెట్ లేకుంటే నో పెట్రోల్: తిరుపతి SP

తిరుపతి జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు మూడు దశల ప్రణాళికను అమల్లోకి తెచ్చామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. చిన్న జాగ్రత్త పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుందన్నారు. జరిమానాలు కాదని.. ప్రాణ రక్షణే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని అందరూ హెల్మెంట్ వాడాలని కోరారు. తిరుపతి జిల్లాలో ఈనెల 15 నుంచి ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.
News December 13, 2025
సంగారెడ్డి: రెండో విడతలో మహిళా ఓటర్లే కీలకం

రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే 10 మండలాల్లో మహిళ ఓటర్లు కీలకం కానున్నారు. మొత్తం 2,99,746 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 1,47,746, మంది మహిళలు 2,51,757 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో మహిళా ఓటర్ల కోసం అభ్యర్థులు ప్రసన్నం చేసుకుంటున్నారు. వేరే ఎవరికి ఓటు వేస్తారో 14వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.


