News March 6, 2025
ADB: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి సిరీయస్

మహారాష్ట్రలో బుధవారం జరిగిన <<15659751>>ఘోర రోడ్డు ప్రమాదంలో<<>> జిల్లాకు చెందిన 16 మందికి గాయాలైన విషయం తెలిసిందే. కాగా వీరిలో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. గుడిహత్నూర్ మండలం గురిజ గ్రామానికి చెందిన వీరు మహారాష్ట్రలోని చంద్రపూర్ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో వీరు ప్రయాణిస్తు వాహనం బోల్తాపడింది.
Similar News
News March 6, 2025
పది పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి: ADB కలెక్టర్

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీతో కలిసి సమావేశం నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12-30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 10,106 మంది పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు.
News March 6, 2025
ADB: మందు తాగిన దంపతులు.. భర్త మృతి

నేరడిగొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడూర్ గ్రామానికి చెందిన రైతు ఈదపు పోశెట్టి (60), అతడి భార్య ఇందిర(52) అప్పుల బాధ భరించలేక గురువారం పురుగు మందు తాగారు. ఈ ఘటనలో పోశెట్టి మృతి చెందగా ఇందిర పరిస్థితి విషమంగా ఉంది. పంట సాగులో నష్టం రావడం, ఇద్దరు పిల్లలకు పెళ్లి చేయడంతో అప్పులు అయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.
News March 6, 2025
ఆదిలాబాద్: పరీక్ష కేంద్రంలో ఇంటర్ విద్యార్థికి అస్వస్థత

ఆదిలాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. గురువారం సెకండ్ ఇయర్ పరీక్ష జరుగుతున్న సమయంలో బాపురావు అనే విద్యార్థికి అకస్మాత్తుగా ఆస్తమా, బీపీ పెరగడంతో అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం 108 లో రిమ్స్ తరలించగా.. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి మెరుగైంది.