News March 5, 2025
ADB: ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

ఉమ్మడి KNR, ADB, NZB, MDK ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో భాగంగా 11వ రౌండ్తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 11వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,935 (75,675), కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 4,387 (70,565), బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 3,473(60,419) ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి 5,110 లీడింగ్లో కొనసాగుతున్నారు.
Similar News
News December 24, 2025
కోదాడ శివారులో రోడ్డుప్రమాదం

కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శివ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివ మరణంతో ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదం ఎలా జరిగింది? మృతికి గల కారణాలేమిటి? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 24, 2025
GNT: జమాబందీ లేక భూ రికార్డుల్లో గందరగోళం

గుంటూరు జిల్లా రెవెన్యూ శాఖలో కీలకమైన జమాబందీ ప్రక్రియను కొన్నేళ్లుగా నిర్వహించకపోవడంతో భూమి రికార్డులు గందరగోళంగా మారాయి. తహశీల్దార్ కార్యాలయాల్లో ఆర్వోఆర్ నిర్వహణ సరిగా లేకపోవడం, కంప్యూటర్ ఆపరేటర్లపై పూర్తిగా ఆధారపడటం వల్ల అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. ఏటా జమాబందీ జరిగితే భూమి హక్కులు స్పష్టమవుతాయి. కానీ అది లేకపోవడంతో జిల్లాలో భూవివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
News December 24, 2025
OTTలోకి ‘బాహుబలి: ది ఎపిక్’

‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా ఈరోజు అర్ధరాత్రి నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. బాహుబలి పార్ట్-1, పార్ట్-2ని కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’గా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ మూవీ డ్యూరేషన్ 3:48 గంటలు. కాగా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా తదితరులు కీలక పాత్రల్లో నటించిన ‘బాహుబలి’ మూవీ తెలుగు సినిమా చరిత్రనే మార్చేసింది. తెలుగు సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ను పరిచయం చేసింది.


