News March 5, 2025

ADB: ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

image

ఉమ్మడి KNR, ADB, NZB, MDK ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో భాగంగా 11వ రౌండ్‌తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 11వ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,935 (75,675), కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 4,387 (70,565), బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 3,473(60,419) ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి 5,110 లీడింగ్‌లో కొనసాగుతున్నారు.

Similar News

News December 17, 2025

సుల్తానాబాద్: 8 ఓట్ల తేడాతో శైలజ విజయం

image

సుల్తానాబాద్ మండలం కందునూరు పల్లె గ్రామ సర్పంచి ఎన్నికల్లో చొప్పరి శైలజ ఘన విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలో ఆయన ప్రత్యర్థిపై కేవలం ఎనిమిది ఓట్ల తేడాతో విజేతగా నిలిచారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని శైలజ ఈ సందర్భంగా తెలిపారు. ఆయనకు మద్దతుగా నిలిచిన గ్రామస్తులు, అభిమానులు సంబరాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

News December 17, 2025

AIతో అసభ్యకర ఫొటోలు.. బాధించాయన్న శ్రీలీల

image

ఏఐ సాయంతో SMలో తన ఫొటోలను అసభ్యంగా ఎడిట్ చేయడంపై హీరోయిన్ శ్రీలీల స్పందించారు. ఏఐని అసభ్యత కోసం వినియోగించడాన్ని ఎవరూ సపోర్ట్ చేయొద్దని చేతులు జోడిస్తూ కోరారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ జీవితాన్ని మరింత సులభతరం చేయాలని, ఇబ్బందులు సృష్టించొద్దని చెప్పారు. మహిళలను లక్ష్యంగా చేసుకొని ఏఐని తప్పుగా వినియోగించడం బాధ కలిగిస్తోందన్నారు. ఈ సమయంలో తమకు మద్దతుగా నిలవాలని అభిమానులను ఆమె కోరారు.

News December 17, 2025

MBNR: ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు పీయూ విద్యార్థిని ఎంపిక

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజ్ కు చెందిన విద్యార్థిని పాత్లావత్ పద్మావతి ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపికయ్యారు. వివిధ దశల స్క్రీనింగ్‌లను ఎదుర్కొని ఎంపిక కావడం పీయూకి గర్వకారణమని, గణతంత్ర వేడుకల్లో తెలంగాణ ఔన్నత్యాన్ని చాటాలని ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ అన్నారు. కోఆర్డినేటర్ డా ప్రవీణ, కంటింజెంట్ అధికారి డా అర్జున్ కుమార్ పాల్గొన్నారు.