News March 5, 2025
ADB: ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

ఉమ్మడి KNR, ADB, NZB, MDK ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో భాగంగా 11వ రౌండ్తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 11వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,935 (75,675), కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 4,387 (70,565), బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 3,473(60,419) ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి 5,110 లీడింగ్లో కొనసాగుతున్నారు.
Similar News
News December 13, 2025
సూర్యాపేట: రెండో దఫా పల్లె పోరుకు తరలిన సిబ్బంది

రెండో దఫా ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో మొత్తం 8 మండలాల్లో ఆదివారం జీపీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మోతె, మునగాల, నడిగూడెం, అనంతగిరి, చిలుకూరు, కోదాడ, పెన్పహడ్, చివ్వేంల మండలాలకు ఎన్నికల సామగ్రితో పంపిణీ కేంద్రాల నుంచి సిబ్బంది ఆయా గ్రామాలకు బస్సుల్లో తరలి వెళ్లారు. అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
News December 13, 2025
‘న్యూ ఇయర్’ వేడుకలకు పోలీసుల ‘కొత్త కోడ్’

TG: న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో 3 స్టార్ హోటల్స్, పబ్స్, క్లబ్లకు HYD పోలీసులు మార్గదర్శకాలు జారీ చేశారు. ‘డ్రగ్స్ దొరికితే యాజమాన్యానిదే బాధ్యత. పార్కింగ్ సహా అంతటా CCTVలు ఉండాలి. బయట రా.10 గం.కు సౌండ్ సిస్టమ్ ఆపాలి. లోపల 45 డెసిబుల్స్తో ఒంటిగంట వరకే అనుమతి. డ్రంకెన్ డ్రైవ్కు రూ.10 వేలు ఫైన్, 6నెలల జైలు/లైసెన్స్ రద్దు. తాగిన వారికి డ్రైవర్లు/క్యాబ్లు నిర్వాహకులే ఏర్పాటు చేయాలి’ అని తెలిపారు.
News December 13, 2025
డెల్టా హాస్పిటల్స్లో 100 రోజుల్లో 60 రోబోటిక్ శస్త్రచికిత్సలు

రాజమండ్రిలోని డెల్టా హాస్పిటల్స్లో కేవలం 100 రోజుల్లో 60కి పైగా రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా చేసినట్టు హాస్పిటల్ ఎండీ డాక్టర్ నితిన్ రిమ్మలపూడి (ఎంఎస్ సర్జన్) తెలిపారు. గాల్ బ్లాడర్, హెర్నియా, గర్భాశయ, బేరియాట్రిక్, థైరాయిడ్ శస్త్రచికిత్సలను ఈ ఆధునిక పద్ధతిలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సాంకేతికత వలన పేషెంట్లు తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావంతో త్వరగా కోలుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.


