News March 14, 2025

ADB: మూడు రోజులు కొనుగోళ్లు బంద్

image

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ పరిధిలో కందులు, శనగ కొనుగోళ్లను మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదిలాబాద్ సెంటర్ ఇన్‌ఛార్జ్ కేంద్రే పండరీ తెలిపారు. శుక్రవారం హోలీ పండుగ, ఆదివారం రావడంతో కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి ఈ నెల 17 నుంచి కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. రైతులు గమనించాలని కోరారు.

Similar News

News March 21, 2025

10TH విద్యార్థులకు ALL THE BEST : కలెక్టర్

image

రేపటి నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్ధులకు కలెక్టర్ రాజర్షి షా ఆల్ ద బెస్ట్ తెలిపారు. పరీక్షలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా అత్యంత జాగ్రత్తగా ఈ పరీక్షలను నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలకు సెల్‌ఫోను అనుమతి లేదని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్, ఆన్ని సౌకర్యాలు కల్పించమన్నారు.

News March 21, 2025

ADB: ప్రజలు భగీరథ నీరు తాగాలి :కలెక్టర్

image

ADB జిల్లాలోని మారుమూల ప్రాంతాల గ్రామ ప్రజలు మిషన్ భగీరథ నీటిని తాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ నీరు ప్రతి గ్రామానికి అందుబాటులో ఉందన్నారు. జిల్లా గ్రామస్థులు ఈ నీటిని సురక్షితంగా తాగవచ్చన్నారు. దీని ద్వారా వేసవిలో నీటి సమస్యలు రాకుండా ఉంటాయని పేర్కొన్నారు.

News March 20, 2025

ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలెర్ట్.. మూడ్రోజులు వర్షాలు

image

రానున్న మూడు రోజులు ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం చేకూర్చనుంది. కానీ చేతికొస్తున్న పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

error: Content is protected !!