News November 27, 2024
ADB: రిమ్స్ డ్రగ్ స్టోర్ను పరిశీలించిన నోడల్ అధికారి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ డ్రగ్ స్టోర్ ను వైద్య ఆరోగ్యశాఖ టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారి మంజునాథ్ మంగళవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంలో డ్రగ్ స్టోర్ లో మందుల నిల్వలపై తో పాటు రిజిస్టర్లు పరిశీలించారు. మందుల కొరత నివారించడానికి జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిఎంహెచ్ఓ డాక్టర్. నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, తదితరులు ఉన్నారు.
Similar News
News December 11, 2025
ఉట్నూర్: భార్య సర్పంచ్, భర్త ఉపసర్పంచ్

ఉట్నూర్ మండలం లింగోజితండా గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి జాదవ్ మాయ.. సమీప ప్రత్యర్థి విమలపై 88 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా ఆమె భర్త హరినాయక్ వార్డ్ మెంబర్గా గెలుపొంది ఉపసర్పంచ్గా ఎన్నికయ్యారు. ఒకే ఇంట్లో రెండు పదవులు రావడంతో వారి మద్దతుదారులు సంబరాలు మొదలుపెట్టారు.
News December 11, 2025
ఆదిలాబాద్ జిల్లాలో మహిళదే విజయం

ఇచ్చోడ మండల పరిధిలోని 28 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని హీరాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ లత విజయం సాధించారు. ప్రత్యర్థి రాథోడ్ మనోజ్పై 50 ఓట్ల తేడాతో రాథోడ్ లత గెలుపొందారు. ఈ గ్రామపంచాయతీలో 8 వార్డు స్థానాలకు సభ్యులను ఎన్నుకున్నారు. .
News December 11, 2025
ఆదిలాబాద్ జిల్లాలో 69.10 శాతం పోలింగ్

ఆదిలాబాద్ జిల్లాలో తొలివిడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 69.10 శాతం ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడలో70.38%, సిరికొండ 85.12%, ఇంద్రవెల్లి 57.60%, ఉట్నూర్ 65.95%, నార్నూర్ 78.18%, గాదిగూడలో 78.18% నమోదైంది.
*GP ఎన్నికల అప్డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి.


