News March 7, 2025

ADB: రూ.20లక్షల అప్పు.. అందుకే సూసైడ్!

image

నేరడిగొండలో <<15670214>>దంపతులు<<>> పురుగుమందు తాగిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. వడూర్‌కు చెందిన పోశెట్టి, ఇందిర దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారి పెళ్లి కోసం బ్యాంక్‌లో రూ.2లక్షలు, బయట రూ.18లక్షలు అప్పుచేశారు. ఈ క్రమంలో చిన్న కూతురు, అల్లుడు వచ్చి అప్పుల గురించి చర్చించగా ఇల్లు అమ్మేందుకు సిద్ధమయ్యారు. దీంతో మనస్తాపం చెంది వారు బుధవారం పురుగుమందు తాగగా పోశెట్టి మృతి చెందాడు. ఇందిర పరిస్థితి విషమంగా ఉంది.

Similar News

News March 10, 2025

జిల్లా అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్

image

పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ, LRS , UDID, ఇంటర్ పరీక్షలు , వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు, పలు అంశాలపై కలెక్టర్ రాజర్షిషా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ ఈ నెల 10న సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. వేసవి దృష్టా త్వరగా పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు.

News March 9, 2025

ADB: MLC రేసులో రేఖానాయక్?

image

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేఖానాయక్ MLA కోటా MLC రేసులో ముందు వరుసలో ఉన్నారు. 2024 ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో ఉన్న ఆమె ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ఆమెకు అవకాశం దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై అదిష్ఠానంతో చర్చించనున్నారు. ఎస్టీ కేటగిరీ నుంచి రేఖానాయక్‌కు అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే

News March 9, 2025

ADB: నేటి నుంచి గ్లాకోమా వారోత్సవాలు

image

ఈ నెల 9 నుంచి గ్లాకోమా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల ఆసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. గ్లాకోమాతో బాధపడే 40 సంవత్సరాలు పైబడ్డ వారంతా ఆయా ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేయించుకొని చికిత్సలు పొందాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన దృష్టి లోపం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు.

error: Content is protected !!