News November 8, 2024
ADB: వార్డు సభ్యుడిగా చేయాలన్నా పోటీనే!

కులగణన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి 2,3 నెలలు సమయం పట్టే అవకాశముండగా గ్రామాల్లో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. పలు కారణాలతో గతంలో పోటీ నుంచి చేయనివారు వారు ఈసారి సై అంటున్నారు. సర్పంచ్ సంగతి పక్కన పెడితే వార్డు సభ్యుడిగా చేయాలన్నా కొన్ని చోట్ల పోటీ ఉంది. వార్డు సభ్యుడిగా గెలిచి ఉపసర్పంచ్ దక్కించుకోవాలని కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉంది?
Similar News
News October 13, 2025
ఆదిలాబాద్లో బంగారు ధర రికార్డు

ఆదిలాబాద్ పట్టణ వెండి, బంగారు వర్తక సంఘం ధరలు ప్రకటించింది. 24 కారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రికార్డు స్థాయిలో రూ.1,30,500 గా నమోదైంది. అదేవిధంగా వెండి 10 గ్రాములకు రూ.1,850గా ఉంది. ఈ కొత్త ధరలు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. బంగారం ధరల్లో పెరుగుదల కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోంది.
News October 13, 2025
ఆదిలాబాద్లో రియాల్టీ ముఠా భారీ కుంభకోణం

ఆదిలాబాద్లో రియాల్టీ ముఠా భారీ కుంభకోణాన్ని బయట పట్టినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. సూర్య రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈడీ, ఎస్బీఐ మార్టగేజ్ అధీనంలో ఉన్న భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడిన ముఠాలో నిందితులు రమేష్ శర్మ, ఇబ్రహీం మహమ్మద్ అరెస్టు చేశామన్నారు. అదేవిధంగా యతేంద్రనాథ్, హితేంద్రనాథ్, రాకేష్, మనోజ్ కుమార్, పూనం, అనుపమ, శివాజీపై కేసు చేశామన్నారు.
News October 12, 2025
ఆదిలాబాద్లో బడా రియాల్టర్లపై కేసు

భూ కబ్జా కేసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా తప్పు చేసిన భూకబ్జా దారులందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వచ్చాక రియల్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా ఎస్.బి.ఐ బ్యాంకు అధీనంలోని భూమిని కబ్జా చేసిన ఘటనలో ఆదిలాబాద్కు చెందిన మామ్లా సెట్, రమేశ్ శర్మతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.