News February 19, 2025

ADB: వివాహేతర సంబంధమే కారణం!

image

బావను బావమరిది <<15502338>>హత్య<<>> చేసిన ఘటన తలమడుగులో మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. CI ఫణిందర్ వివరాలు.. ADB లోని తంతోలికి చెందిన మహేందర్(40)కు రుయ్యాడికి చెందిన నవితతో వివాహమైంది. కాగా కొన్నిరోజులుగా మహేందర్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో నిన్న అశోక్ ఇంటికి వచ్చి మహేందర్‌కు నచ్చజెప్పేందుకు చూశాడు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరగడంతో అశోక్ తన బావను కత్తితో పొడిచి హత్య చేశాడు.

Similar News

News April 10, 2026

ఒకే రోజు రూ.2,950కోట్లు రిలీజ్.. అకౌంట్లలోకి డబ్బులు: TDP

image

AP: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ చేసిన దుర్మార్గం నుంచి కూటమి ప్రభుత్వం బయట పడేస్తోందని TDP తెలిపింది. CM ఆదేశాలతో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకే రోజు రూ.2,950CR విడుదల చేసినట్లు వివరించింది. పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమైనట్లు చెప్పింది. అటు సర్వీస్‌లో ఉన్న పోలీసుల సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులూ మొదలైనట్లు ఓ అకౌంట్లో డబ్బులు పడిన ఫొటోను ట్వీట్ చేసింది.

News April 10, 2026

ముదిగుబ్బ: ట్యాంకర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

image

ముదిగుబ్బ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. అనంతపురం రోడ్డులో ముందు వెళ్తున్న నీటి ట్యాంకర్‌ను ఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హెడ్ కానిస్టేబుల్ గణేశ్ ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News April 10, 2026

వేరుశనగ ధరలు పతనం

image

ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వారం రోజులుగా క్వింటా రూ.7 వేలకు పైగా పలికిన ధర, గురువారం గరిష్ఠంగా రూ.6,690లకు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌కు 113 క్వింటాళ్ల దిగుబడి రాగా, కనిష్ఠ ధర రూ.5,700, మధ్యస్తంగా రూ.6,121లకు అమ్ముడుపోయినట్లు యార్డ్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. ధరల తగ్గుదలపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.