News February 13, 2025
ADB: వ్యక్తిపై లైంగిక దాడి కేసు

తనను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ADB 1 టౌన్ CI సునీల్ కుమార్ వివరాలు.. తల్లిగారింటి వద్ద ఉంటున్న ఓ వివాహిత(24), శాంతినగర్కి చెందిన షేక్ ఆసిఫ్ 8నెలల పాటు సహజీవనం చేశారు. కాగా తనను ఆసిఫ్ మోసం చేశాడని, లైంగికంగా వేధించి తన వీడియోలు తీశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఆసిఫ్ తనను కులం పేరుతో దూషించాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదైంది.
Similar News
News December 18, 2025
AILET ఫలితాలు విడుదల

ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్(AILET) ఫలితాలు విడుదలయ్యాయి. https://nationallawuniversitydelhi.in/లో యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఢిల్లీలోని ప్రఖ్యాత నేషనల్ లా యూనివర్సిటీలో ఐదేళ్ల B.A.LL.B.(Hons.), ఏడాది LL.M. కోర్సుల్లో ప్రవేశాలకు డిసెంబర్ 14న ఈ పరీక్ష జరిగింది. దాదాపు 26వేల మంది హాజరయ్యారు. ఈ వర్సిటీలో క్లాట్, ఎల్ శాట్ స్కోర్లతో అడ్మిషన్ లభించదు.
News December 18, 2025
కొల్లేరు హద్దుల నిర్ధారణలో వేగం పెంచాలి: JC

కొల్లేరు అభయారణ్యం సరిహద్దుల నిర్ధారణ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా JC అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. గురువారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పాత మ్యాప్ల ఆధారంగా ఉమ్మడి తనిఖీలు నిర్వహించాలన్నారు. రెవెన్యూ, అటవీ, సర్వే శాఖలు సమన్వయంతో పనిచేసి హద్దుల ఏర్పాటులో పురోగతి చూపాలని, నిబంధనల ఉల్లంఘనలకు తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు.
News December 18, 2025
ఇతిహాసాలు క్విజ్ – 100 సమాధానం

ఈరోజు ప్రశ్న: ఏ రాక్షస రాజు తన తపస్సు ద్వారా మహావిష్ణువును మెప్పించి, తన శరీరం అన్ని తీర్థాల కంటే పవిత్రంగా ఉండాలనే వరం పొందాడు? చివరికి విష్ణువు పాదం మోపడం ద్వారా ఆ అసురుడు ఏ పుణ్యక్షేత్రంగా మారాడు?
సమాధానం: రాక్షస రాజు గయాసురుడు తన తపస్సు ద్వారా విష్ణువును మెప్పించాడు. ఆయన శరీరంపై విష్ణువు పాదం మోపడం వలన అది ప్రసిద్ధ గయ పుణ్యక్షేత్రంగా మారింది.
<<-se>>#Ithihasaluquiz<<>>


