News April 29, 2024
ADB: ‘సందేహాలు, ఫిర్యాదుల కోరకు సంప్రదించండి’

లోక్ సభ ఎన్నికల సందర్భంగా అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబందించి ఏమైనా సందేహాలు, ఫిర్యాదుల కోరకు సంప్రదించవచ్చని పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద తెలిపారు. ఫిర్యాదు చేయదలుచుకున్న వారు ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు 8143876383 నంబర్కు ఫోన్ చేయవచ్చన్నారు. నేరుగా ఫిర్యాదు చేయదలచిన వారు ఆదిలాబాద్లోని పెన్ గంగా గెస్ట్ హౌస్లో సంప్రదించవచ్చని ఆయన సూచించారు.
Similar News
News April 11, 2026
ADB: కారుణ్య నియామకాల్లో 16 మందికి ఉత్తర్వులు

జిల్లాలో కారుణ్య నియామకాల కింద వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎంపికైన 16 మంది అభ్యర్థులకు ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ రాజర్షిషా శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నియామక ఉత్తర్వులను అందజేశారు. 10 రెవెన్యూ , 2 సేల్స్ టాక్స్, 1 వెల్ఫేర్, 1 వైద్య శాఖ, 1 అకౌంట్స్, 1 ఇరిగేషన్ శాఖలకు కేటాయించారు.మొత్తం 15 జూనియర్ అసిస్టెంట్, ఒక ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పత్రాలిచ్చారు.
News April 11, 2026
ADB: కొత్త ‘మీసేవ’లకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో పౌర సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం కొత్త మీసేవ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఫ్రాంచైజీలు కేటాయించనుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.
News April 10, 2026
ADB: ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్

ADB జిల్లా కేంద్రంలోని శాంతినగర్లోని ఈవీఎం భద్రతా కేంద్రాన్ని (గోదాం) జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి నెలా నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన ఈ సందర్శన చేపట్టారు. ఈ సందర్భంగా గోదాం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.


