News February 21, 2025
ADB: సమ్మర్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా అధికారులతో కలెక్టర్ రాజర్షిషా గురువారం గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమీక్షించారు. ప్రజాపాలన, గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయని వారు కొత్త రేషన్ కార్డ్, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుటకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వేసవిలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు సమ్మర్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలని RWS అధికారులను ఆదేశించారు.
Similar News
News February 22, 2025
ADB: బాలికపై అత్యాచారం.. ముగ్గురి అరెస్ట్: SP

తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవని ADB ఇన్ఛార్జ్ SP జానకి షర్మిల అన్నారు. బాలికపై << 15538444>>అత్యాచార <<>>ఘటనలో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితులు అనిల్, గంగాధర్, సుష్మలను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఎలాంటి సందేహం లేకుండా, నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 22, 2025
ADB: చంపుతున్నాయ్.. తింటున్నాయ్

ఉమ్మడి ADBజిల్లాను పెద్దపులి, చిరుత హడలెత్తిస్తున్నాయి. అటవీ ప్రాంతం నుంచి బయటకి వచ్చి జంతువులపై దాడి చేసి చంపేసి తినేసి వెళ్తున్నాయి. శుక్రవారం మంచిర్యాల జిల్లాలో గేదెను పెద్దపులి చంపగా.. నిర్మల్ జిల్లా భైంసా డివిజన్లో చిరుత గొర్రెపిల్లపై దాడి చేసిందని అటవీ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ADB జిల్లా తాంసి, తలమడుగు, భీంపూర్ మండలాల్లో చిరుత రైతులను పనులు చేసుకోనీయడం లేదు.
News February 22, 2025
ADB: ముస్లిం ఉద్యోగులకు GOO NEWS

రంజాన్ నెలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు దృష్టిలో ఉంచుకొని వారికి ఉద్యోగ సమయాల్లో వెసులుబాటు కల్పించినట్లు ADB కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు మార్చి 2 నుంచి 31 వరకు సాయంత్రం 4 గంటలకే కార్యాలయ విధులు నిర్వహించుకొని ఇళ్లకు వెళ్లవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నమాజ్, రోజా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.