News April 7, 2024

ADB: ఆటో బోల్తా ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

image

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. ఆదిలాబాద్ నుంచి జైనథ్ వైపు వెళ్తున్న ఆటో.. తర్నం బ్రిడ్జి వద్ద బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న భరత్‌కు తీవ్ర గాయలై అక్కడికక్కడే మృతిచెందగా పుష్ప, పద్మా అనే మహిళలకు గాయాలయ్యాయి. మృతుడి అన్న ఇచ్చిన ఫిర్యాదుతో ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ సాయినాథ్ తెలిపారు.

Similar News

News December 17, 2025

ఒక్క ఓటుతో మూత్నూర్ తండా సర్పంచ్‌గా జాదవ్ రాంజీ

image

గుడిహత్నూర్ మండలంలోని మూత్నూర్ తండా గ్రామ సర్పంచ్‌గా జాదవ్ రాంజీ నాయక్ విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 1 ఓటు తేడాతో గెలుపొందారు. ప్రజల సమస్యల పరిస్కారానికి తన వంతు కృషి చేస్తూ.. ప్రతి క్షణం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

News December 17, 2025

ADB: ‘కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమాన్ని విజయవంతం చేయండి’

image

ఈనెల 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంను విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ కోరారు. ఆశ కార్యకర్తతో కూడిన బృందం ఈ ఉద్యమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి అందరిని పరీక్షించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 1002 బృందాలు ఈ సర్వేలో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ప్రజలు అందరు తమ ఇంటికి వచ్చే సర్వే బృందాలకు సహకరించాలని కోరారు.

News December 17, 2025

ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విజయం మహిళదే

image

మూడో విడత స్థానిక ఎన్నికల్లో భాగంగా తలమడుగు మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీల్లో బుధవారం సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పల్లి-కే సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గుమ్ముల లక్ష్మి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి తొడసం రుక్మా బాయిపై 39 ఓట్ల తేడాతో గెలుపొందారు. 29 గ్రామ పంచాయతీలు ఉండగా.. 7 ఏకగ్రీవం అయ్యాయి.