News July 8, 2024
ADB: ఆదివాసీ గ్రామాల్లో సంబురాలు
ఆదివాసీలు ప్రతి ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే అకాడి వేడుకలను నిన్న భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్, తిర్యాణి పలు మండలాల్లోని ఆదివాసీలు అడవీకి వెళ్లి వన దైవానికి మహాపూజ చేశారు. మక్క ఘట్కతో తయారు చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పించారు. ఊర్లోని ఆవులన్నింటినీ అడవీలో ఊరేగించారు. గ్రామస్థులంతా ఒకచోట చేరి సామూహిక వనభోజనాలు చేశారు. ఈ వేడుకలు నేటితో ముగియనున్నాయి.
Similar News
News October 5, 2024
లోకేశ్వరం: విష జ్వరంతో మహిళ మృతి
విష జ్వరంతో మహిళ మృతి చెందిన ఘటన శనివారం లోకేశ్వరం మండల కేంద్రంలో
చోటుచేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని లోకేశ్వరం గ్రామానికి చెందిన సిరిపెల్లి గంగామణి 34 జ్వరంతో బాధపడుతూ
లోకేశ్వరంలో డాక్టర్ను సంప్రదించిన నయం కాకపోవడంతో నిర్మల్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందినట్లు తెలిపారు.
News October 5, 2024
ADB: గ్రేట్.. ఒకేసారి మూడు ఉద్యోగాలు
ఒకేసారి మూడు ఉద్యోగాలకు ఎంపికై ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓరగంటి ప్రశాంత్ ప్రభంజనం సృష్టించాడు. పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన ఓరగంటి రాజన్న, విజయ దంపతుల కుమారుడు ప్రశాంత్(32) ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో SA(సోషల్), LP(తెలుగు)తో పాటు SGT ఉద్యోగాలు సాధించి సత్తా చాటాడు. కష్టపడి చదివి మూడు ఉద్యోగాలు సంపాదించడంతో ఆయన్ను పలువురు అభినందించారు.
News October 5, 2024
ఆదిలాబాద్: ఓపెన్ డిగ్రీ, పీజీ అడ్మిషన్లకు గడువు పెంపు
డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీలో ప్రవేశాలకై గడువు పొడగించినట్లు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా. సంగీత తెలిపారు. డిగ్రీ, పీజీ, తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరవచ్చని సూచించారు. SEP 30 వరకు గడువు పూర్తవగా దాన్ని OCT 15 వరకు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
>>SHARE IT