News March 17, 2025
ADB: ఆ రైతు గ్రేట్.. తొలికాత విద్యార్థులకే

సహజంగా ఏ రైతైనా పంట తొలికాతను దేవుడికి సమర్పిస్తుంటారు.. కానీ ఆ రైతు మాత్రం తాను పండించిన పంటను ముందుగా విద్యార్థులకే అందిస్తుంటారు. బాలల్లోనే తాను దైవాన్ని చూస్తానని చెబుతున్నారు. ADBజిల్లా తాంసి మండలం పొన్నారికి చెందిన రైతు అండే ఆనంద్ తాను సాగుచేస్తున్న పుచ్చకాయ(వాటర్మిలన్) తొలికాతను ఏటా విద్యార్థులకు పంచి పెడుతున్నారు. రైతును పలువురు అభినందిస్తున్నారు. మీ ప్రాంతంలో ఇలా ఉంటే కామెంట్ చేయండి.
Similar News
News September 15, 2025
భద్రాద్రి: ‘సూర్యాంశ్’ నామకరణం చేసిన KTR

అన్నపురెడ్డిపల్లి మాజీ ZPTC దంపతులు లావణ్య-రాంబాబు తమ కుమారుడికి పేరు పెట్టాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను కలిశారు. దంపతులు ‘సు’ అక్షరంతో పేరు కోరగా, KTR తన కుమారుడు హిమాన్షు పేరును గుర్తు చేసుకుని, సూర్యాంశ్ అని నామకరణం చేశారు. KTR దీవెనలు తమ కొడుకును ఆయనలాగే గొప్ప వ్యక్తిని చేస్తాయన్న నమ్మకం ఉందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ అభిమాన నేతతో గడిపిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.
News September 15, 2025
ASF: మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లో దరఖాస్తుల ఆహ్వానం

సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో వయోవృద్ధుల కోసం మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు సంక్షేమ శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సెంటర్లో సేవలందించేందుకు సీనియర్ సిటిజన్ అనిసియేషన్, NGOల నుంచి దరఖాస్తు కోరడం జరుగుతుందన్నారు. అనుభవం కలిగిన వారు పూర్తి వివరాలతో ఈనెల 19లోపు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
News September 15, 2025
NRPT: ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి: ఎస్పీ

నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ ప్రోగ్రాంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణిలో అందిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఫిర్యాదులను పరిశీలించి, చట్ట ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు.