News April 3, 2024
ADB: ఇంటికే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ తలంబ్రాలను అక్కడికి వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ ద్వారా అందజేయడం జరుగుతుందని ఆర్ఏం సులేమాన్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడారు. తలంబ్రాల కోసం ఉమ్మడి జిల్లాలోని కార్గోపార్సిల్ కేంద్రాల్లో భక్తులు ఒక ప్యాకెట్కు రూ.151 చెల్లించాలన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
Similar News
News February 20, 2026
చైల్డ్ పోర్నోగ్రఫీ.. ఆదిలాబాద్ జిల్లాలో 5 కేసులు: ఎస్పీ

చైల్డ్ పోర్న్ వీడియోలు చూడటం, డౌన్లోడ్ చేయటం, సోషల్ మీడియాలో షేర్ చేయటం చట్టరీత్యా తీవ్రమైన నేరమని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 5 కేసులు నమోదు అయ్యాయన్నారు. హైదరాబాద్ “చైల్డ్ టిప్ లైన్” పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు.
News February 20, 2026
ఆదిలాబాద్: ఈనెల 24న జాబ్ మేళా

ఆదిలాబాద జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఆదిలాబాద్ ప్రభుత్వ ITI కళాశాలలో ఈనెల 24న మంగళవారం జాబ్ మెళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పన అధికారి మిల్కా తెలిపారు. ఏదైనా డిగ్రీ చేసి 18 నుంచి 35 లోపు వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి ఆకర్షనీయమైన జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
News February 20, 2026
ఆదిలాబాద్: పది పరీక్షలకు 52 పరీక్ష కేంద్రాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 10,888 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ రాజేశ్వర్ వెల్లడించారు. వీరిలో 5,443 మంది బాలురు, 5,445 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పర్యవేక్షణ కోసం 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 13 మంది కస్టోడియన్లను నియమించినట్లు ఆయన పేర్కొన్నారు.


