News August 1, 2024
ADB: ఇన్స్టాగ్రామ్లో తప్పుడు ప్రచారం.. కేసు నమోదు

ఆదిలాబాద్లోని ఓ హోటల్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులపై 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న నలుగురు వ్యక్తులు హోటల్లో భోజనానికి వెళ్లి సిబ్బందితో గొడవపడి బయటకు వచ్చేశారు. అనంతరం హోటల్ ఫొటో తీసుకొని అందులో భోజనం సరిగా ఉండదని, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా కామెంట్స్ రాసి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ఈ విషయమై హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News April 10, 2026
ADB: టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులు బంద్

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులను అధికారులు నిలిపివేశారు. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే రుసుము స్వీకరించనున్నారు. నిబంధన ఉల్లంఘించి నగదు ఇచ్చేవారు 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని రోలమామడ, గంజాల్ టోల్ ప్లాజాల వద్ద ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందుగానే ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News April 10, 2026
ఆదిలాబాద్: వాట్సాప్లో ఓపెన్ స్కూల్ హాల్టికెట్లు

ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షల హాల్టికెట్లను ఈసారి సులభంగా వాట్సాప్ ద్వారా పొందే వెసులుబాటు కల్పించినట్లు DEO రాజేశ్వర్ తెలిపారు. విద్యార్థులు 8096958096 నంబర్ను ఫోన్లో సేవ్ చేసుకుని, ‘HAI’ అని మెసేజ్ పంపడం ద్వారా ఈ సేవను పొందవచ్చు. అక్కడ కనిపించే ఆప్షన్లలో పదో తరగతి లేదా ఇంటర్ థియరీని ఎంచుకుని, అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేస్తే హాల్టికెట్ డౌన్లోడ్ అవుతుందని ఆయన వివరించారు.
News April 9, 2026
BREAKING: ఆదిలాబాద్ జిల్లాలో ACB దాడులు

ఆదిలాబాద్ జిల్లాలో గురువారం ACB అధికారులు దాడులు నిర్వహించారు. బోథ్ ఫారెస్ట్ ఆఫీస్లో దాడులు నిర్వహించగా లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ పట్టుపట్టారు. ACB DSP ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. కాసేపట్లో ఆయన వివరాలు వెల్లడించనున్నారు.


