News February 25, 2026

ADB: ఉమ్మడి జిల్లాలో 15 వేల పాసుపుస్తకాలు పెండింగ్‌

image

6 నెలలుగా పట్టా పాసుబుక్కులు జారీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులుపడుతున్నారు. ఉమ్మడి ADBజిల్లాల్లో రోజుకు 75-100 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. డిజిటల్ సిగ్నేచర్ తర్వాత ప్రింటింగ్ ఏజెన్సీ ఇంటి వద్దకే పాసుపుస్తకాలు పంపాలి. ఏజెన్సీకి ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో ప్రింటింగ్ నిలిపివేసింది. ప్రభుత్వం ఈబాధ్యతలను మరో ఏజెన్సీకి అప్పగించింది. ఉమ్మడిజిల్లాలో దాదాపు 15వేల పాసుపుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి.

Similar News

News March 2, 2026

TODAY TOP NEWS

image

* ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం
* ఖమేనీ హత్యకు నిరసనగా HYD, BLR, ఢిల్లీలో నిరసనలు
* విశ్వసనీయతతోనే మధ్యవర్తిత్వం సఫలం: CJI
* కేసులు పరిష్కరించే మధ్యవర్తులకు రూ.10,000: CBN
* 2029లో జగన్ సీఎం కావడం తథ్యం: కొడాలి నాని
* GST వసూళ్లలో ఏపీ, తెలంగాణ దూకుడు
* సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి
* T20WC సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
* ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: 10% పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర

News March 2, 2026

HYDలో హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచులు

image

TG: హైదరాబాద్ గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఈ నెల 8 నుంచి 14 వరకు ఉమెన్స్ హాకీ వరల్డ్‌కప్ క్వాలిఫయర్ మ్యాచులు జరగనున్నాయి. FIH&హాకీ ఇండియాతో కలిసి రాష్ట్ర క్రీడా శాఖ వీటిని హోస్ట్ చేయనుంది. ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రియా, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ పాల్గొననున్నాయి. భారత జట్టుతో పాటు స్కాట్లాండ్, ఉరుగ్వే టీమ్‌లు ఇప్పటికే HYD చేరుకున్నాయి. ఈ ఇంటర్నేషనల్ టోర్నీ HYDలో జరగడం ఇదే తొలిసారి.

News March 2, 2026

నల్గొండలో పర్యటించనున్న మల్లికార్జున ఖర్గే

image

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేపు నల్గొండలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి 3 గంటలకు నాగార్జున సాగర్ బుద్దవనం రానున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అనంతరం రాష్ట్ర నాయకులతో భేటీ అయి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై దిశా నిర్దేశం చేయనున్నారు.