News October 13, 2024
ADB: ఎంబీబీఎస్లో సీటు.. విద్యార్థికి రూ.50 వేల సాయం

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మరపగూడకు చెందిన పూనం అశోక్ MBBSలో ర్యాంకు సాధించాడు. ఈ మేరకు ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం విద్యార్థిని శనివారం ఘనంగా సన్మానించారు. అనంతరం రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయిసెంటర్ జిల్లా మెస్రం దుర్గం, సర్పంచుల సంఘం మాజీ మండలాధ్యక్షుడు రూపాదేవ్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 24, 2026
ADB: 108 సిబ్బంది సేవలు అభినందనీయం

ఆపద సమయంలో 108 అంబులెన్స్ సిబ్బంది సేవలు అభినందనీయమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా 108, 102 ఉత్తమ సేవల్లో హైలెట్ బెస్ట్ ఈఎంటీ, పైలట్ అవార్డులను మంగళవారం కలెక్టర్ అందజేశారు. ఈఎంటీ రేఖ, రాజేశ్వర్, పైలట్ శివకుమార్ ఈ అవార్డులను అందుకున్నారు. అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్, జిల్లా కోఆర్డినేటర్ శేఖర్, మనోహర్ వసీం పాల్గొన్నారు.
News February 24, 2026
ఆదిలాబాద్: ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్ను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరోడ్రమ్ ప్రాంతంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఎన్ని ఎకరాలు ఎక్కడి వరకు ఎన్ని భూములు వెళ్తున్నాయో మ్యాప్ ఆధారంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపళ్లి గంగాధర్ రావు, కనపర్తి చంద్రకాంత్, కౌన్సిలర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
News February 24, 2026
ఆదిలాబాద్: రూ.1,000 కోట్లు ఎక్కడివి: కేటీఆర్

గాంధీ కుటుంబానికి రూ.1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల డబ్బులు తన అయ్యా సొమ్మా అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్తో ములాఖత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రైతులకు రైతు బంధు కోసం డబ్బులు లేవు గానీ, గాంధీ కుటుంబానికి రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేంద్ర సంస్థలు ఏమి చేస్తున్నాయన్నారు.


