News September 6, 2025
ADB: ఐదుగురు ఆకతాయిలపై కేసు నమోదు

మహిళలను వేధిస్తున్న ఐదుగురు ఆకతాయిలపై కేసు నమోదు చేసినట్లు షీటీం ఇన్ఛార్జ్ ASI సుశీల తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మహిళల భద్రతకు షీటీం స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. ఈ మేరకు మహిళలను వేధిస్తూ రెడ్ హ్యాండెడ్గా ఐదుగురిని పట్టుకున్నామన్నారు. వీరిలో మయూర్, సిద్దు, కార్తీక్, గణేష్, వినాయక్పై 1 టౌన్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మహిళలు అత్యవసర సమయంలో 8712659953కు కాల్ చేయాలని సూచించారు.
Similar News
News September 6, 2025
ADB: మహా నిమజ్జనం వేళ మానవత్వం చాటుకుందాం

ఆదిలాబాద్ జిల్లాలో నేడు 450 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. వీటిలో దాదాపు 50 శాతం విగ్రహాల వద్ద బ్యాండ్లను ఏర్పాటు చేశారు. బ్యాండ్ వాయించేవారు అలసిపోయినప్పుడు వారికి కొద్దిగా విశ్రాంతి ఇవ్వడం, మంచి నీరు, ఆహారం అందించడం ద్వారా నిర్వాహకులు మానవత్వాన్ని చాటుకోవాలని సామాజికవేత్తలు కోరారు. వారిని ఇబ్బంది పెట్టకుండా తోటి మానవులుగా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
News September 6, 2025
ADB: నేడు 450 వినాయక విగ్రహాల నిమజ్జనం

జిల్లావ్యాప్తంగా రెండు వేల గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు జిల్లావ్యాప్తంగా 1500 గణపతుల నిమర్జనాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాయని పేర్కొన్నారు. శనివారం 450 గణపతి విగ్రహాల నిమజ్జనం ఉందని పేర్కొన్నారు. చివరి గణపతి నిమర్జనం పూర్తి అయ్యే వరకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తతోనే వ్యవహరిస్తుందని తెలిపారు.
News September 6, 2025
ADB రిమ్స్లో ఉపాధ్యాయ దినోత్సవం

ఆదిలాబాద్ రిమ్స్లో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. రిమ్స్లో వైద్య విద్య చదువుతున్న 2021 విద్యార్థులు.. వైద్యులను ఆడిటోరియంలో సత్కరించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సైతం వైద్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు దీపక్ పుష్కర్, నరేందర్ బండారి, వైద్యులు సందీప్ జాదవ్, తిప్పే స్వామి, సరోజ, అవినాష్రెడ్డి ఉన్నారు