News December 3, 2025
ADB: ఓటుకు నోటు.. చివరి నిమిషం కీలకం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరగనున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలక మలుపు చివరి నిమిషంలో చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అభ్యర్థులు ఎన్నికల ముందు రాత్రి మద్యం, డబ్బు పంపిణీ ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తారని తెలిపారు. కొందరూ ఓటర్లు పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరూ మద్యం, డబ్బులు ఇస్తే వారికే ఓట్లు వేసే ప్రయత్నం చేస్తారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Similar News
News December 3, 2025
ఏలూరు: 16 మంది విద్యార్థులు సస్పెండ్

ఏలూరు వైద్య కళాశాలలో 3 సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపల్ సావిత్రి మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి జరిగిన జూనియర్, సీనియర్స్ మధ్య ఘర్షణపై బాధితుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు తీసుకొని విచారణ జరిపి 16 మంది విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ర్యాగింగ్ కమిటీ పర్యవేక్షణ నిర్వహిస్తున్నారని, ర్యాగింగ్కు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 3, 2025
నెల్లూరులో భారీ వర్షం.. నీట మునిగిన కారు

రాత్రి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురు గాలులకు 28వ డివిజన్లోని జీకే కాలనీలో భారీ చెట్టు పడిపోయింది. సమీపంలోని అపార్ట్మెంట్ సెల్లార్లోకి నీళ్లు రావడంతో కార్లు, బైకులు పూర్తిగా మునిగిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ అధికారులతో కలిసి వాటర్ను బయటికి తీయిస్తున్నారు.
News December 3, 2025
విష్ణుమూర్తి నామాల్లోనే ఆయన మహిమలు

అగ్రాహ్య శ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః|
ప్రభూత స్త్రికకుబ్ధామ ప్రవిత్రం మంగళం పరమ్||
విష్ణుమూర్తి అగ్రాహ్యుడు. అంటే ఆయన గురించి తెలుసుకోవడం అసాధ్యం. అలాగే శాశ్వతుడు, చీకటిని పాలద్రోలే శ్రీకృష్ణుడు. ఆయనే ఎర్రటి కనుల లోహితాక్షుడు. ప్రతర్దనః, ప్రభూతః కూడా విష్ణువే. 3 లోకాలలను పాలించే పవిత్రుడు, మంగళ స్వరూపుడు, వెలుగునే తన మార్గంగా మార్చుకున్న నారాయణుడే మన ఆది దేవుడు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>


