News August 4, 2025
ADB కలెక్టర్ను సన్మానించిన ఉన్నతాధికారులు

HYD రాజ్భవన్లో ఇటీవల జరిగిన నీతిఆయోగ్ నార్నూర్ బ్లాక్ రాష్ట్ర స్థాయి సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమారోహ్లో గవర్నర్ చేతుల మీదుగా స్వర్ణ పతకాన్ని ADB కలెక్టర్ రాజర్షి షా అందుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా సన్మానించారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందుకోవడం మన జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఇది ఒక వ్యక్తిగత విజయంగా కాకుండా, అందరి సమష్టి కృషి ఫలితంగా సాధించామని చెప్పారు.
Similar News
News September 9, 2025
ఉట్నూర్: ‘ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానం’

ఒక్క కెమెరా 100 పోలీసులతో సమానమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లో 50 సీసీ టీవీ కెమెరాలతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ కలిసి ప్రారంభించారు. నిష్ణాతులైన సిబ్బంది ద్వారా 24 గంటలు పర్యవేక్షిస్తామని తెలిపారు. రాత్రి సమయంలోనూ దృశ్యాలు కనిపిస్తాయన్నారు.
News September 9, 2025
రేపు చాకలి ఐలమ్మ వర్ధంతి: ఆదిలాబాద్ కలెక్టర్

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఈనెల 10న అధికారికంగా నిర్వహించనున్నామని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసిందన్నారు. కావున రిమ్స్ ఆసుపత్రి ఎదుట చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నిర్వహించే వర్ధంతి కార్యక్రమనికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, బీసీ, రజక సంఘాల నాయకులు, ప్రజలు హాజరవ్వాలని కోరారు.
News September 9, 2025
ఆదిలాబాద్: అధ్యాపక పోస్టుకు డెమోకు ఆహ్వానం

ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్లో ఖాళీగా ఉన్న తెలుగు అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థులు నేరుగా డెమోకు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ డా.జె.సంగీత పేర్కొన్నారు. అభ్యర్థులు పీజీ సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులు కలిగి ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 11వ తేదీ గురువారం కళాశాలలో జరిగే డెమోకు నేరుగా హాజరు కావాలని పేర్కొన్నారు.