News January 30, 2025

ADB: కుంభమేళాకు స్పెషల్ రైళ్లు

image

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం SCR 4 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. చర్లపల్లి-దానాపూర్ మధ్య ఫిబ్రవరి 5, 7 తేదీల్లో దానాపూర్-చర్లపల్లి మధ్య 7,9 తేదీల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. తెలంగాణలో జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనున్నాయి.

Similar News

News November 4, 2025

ఆధార్ PVC కార్డును ఈజీగా అప్లై చేయండిలా!

image

ఆధార్‌ను PVC కార్డుగా మార్చుకుంటే ఎక్కువ మన్నికగా ఉంటుంది. పర్సులో పెట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. హోలోగ్రామ్, మైక్రో-టెక్స్ట్, సెక్యూర్ క్యూఆర్ కోడ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉన్న ఈ కార్డును ఆన్‌లైన్‌లో సులభంగా ఆర్డర్ చేసుకోవచ్చు. UIDAI <>వెబ్‌సైట్‌లో<<>> మీ ఆధార్ నంబర్ లేదా EIDతో లాగిన్ అవ్వాలి. OTP ద్వారా ధ్రువీకరించి రూ.50 చెల్లిస్తే చాలు ఈ కార్డు ఇంటికే వస్తుంది. SHARE IT

News November 4, 2025

మెదక్: స్పెషల్ లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి: ఎస్పీ

image

ఈనెల 15న జరిగే స్పెషల్ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సూచించారు. జిల్లా పోలీస్ అధికారులు, కోర్ట్ డ్యూటీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ, ప్రతి పోలీస్ అధికారి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను సమీక్షించారు. ఏఎస్పీ మహేందర్ ఉన్నారు.

News November 4, 2025

ఏటూరునాగారం: ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్ మేళా

image

ఏటూరునాగారం ఐటీఐ కళాశాలలో ఈనెల 10న అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. హైదరాబాదుకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు అప్రెంటిస్ మేళాలో హాజరవుతారన్నారు. వివిధ ట్రేడ్లలో అనుభవం, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 10న ఐటీఐ కళాశాలలో హాజరుకావాలని కోరారు.