News October 12, 2025

ADB: కూలెక్కిన రాజకీయం..!

image

స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడటంతో అభ్యర్థుల్లో నిరాశ అలుముకుంది. నాలుగైదు రోజుల వరకు భారీగా ఖర్చుపెట్టిన నేతలు ఇప్పుడు చల్లబడ్డారు. ఎన్నికలు అసలు ఇప్పట్లో జరుగుతాయని ప్రశ్న అందరిలో మొదలైంది. ఉట్నూరు, నార్నూర్ తదితర మండలాల్లో నాయకులు కనీసం చాయ్ కూడా తాపడం లేదని చర్చ నడుస్తోంది. ఇంకొన్ని చోట్ల అరే ఇప్పుడు కాదు మల్ల పెద్దగానే దావత్ చేసుకుందాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

Similar News

News October 12, 2025

పంజాగుట్ట యాక్సిడెంట్ మృతిచెందింది వీరే!

image

పంజాగుట్ట PS పరిధిలోని గ్రీన్ ల్యాండ్స్ వద్ద తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈప్రమాదంలో రాపిడో డ్రైవర్ ముద్ధంగల్ నవీన్(30) అక్కడికక్కడే మృతి చెందగా.. వెనుక సవారీ చేసిన డాక్టర్ కస్తూరి జగదీష్ చంద్ర(35) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసులు లారీ డ్రైవర్ శంకర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News October 12, 2025

58 మంది పాక్ సైనికులు హతం: తాలిబన్ ప్రతినిధి

image

అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఘర్షణల్లో పాక్ సైన్యంలో 58 మంది హతమైనట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తెలిపారు. సరిహద్దు, గగనతల ఉల్లంఘనలకు దీటుగా బదులిచ్చినట్లు చెప్పారు. 25 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. ఐసిస్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దని PAKను హెచ్చరించారు. పాక్ కాబూల్‌లోని ఓ మార్కెట్‌లో బాంబు దాడి చేసినట్లు ఆరోపించారు. దీనికి పాక్ ధ్రువీకరించాల్సి ఉంది.

News October 12, 2025

సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ఆహ్వానం

image

జాతీయ స్థాయిలో జరిగే సైనిక్ స్కూల్ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 6వ తరగతికి 01.04.2014 నుంచి 31.03.2016 మధ్య జన్మించి ఉండాలి. 9 వ తరగతి ప్రవేశాలకు 01.04.2011 నుంచి 31.03.2013 మధ్య పుట్టిన వారు అర్హులు. ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.