News October 9, 2025

ADB: కోర్టు తీర్పు+నోటిఫికేషన్= ఉత్కంఠ

image

స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. బుధవారం హైకోర్టు తీర్పు వస్తుందని అందరూ ఆశగా ఎదురు చూశారు. అది కాస్త గురువారానికి వాయిదా పడటంతో ఉమ్మడి జిల్లా ఆశావహుల్లో ఆందోళన కొనసాగుతోంది. రిజర్వేషన్లు ఏ స్థాయిలో అమలవుతాయి దానిని బట్టి నామినేషన్లు వేద్దామని భావించారు. నేడు ఓవైపు తీర్పు రావడం, మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో ఏం జరుగుతుందోనని ఆంతటా ఆసక్తి నెలకొంది.

Similar News

News October 9, 2025

JNG: పేరెంట్స్ GREAT.. ఆరుగురి ప్రాణాలు నిలబెట్టారు

image

రఘునాథపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన గాదె యుగంధర్(29) హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో అతని తల్లిదండ్రులు కుమారుని అవయవాలు దానం చేసి ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, రెండు కళ్లు వేరు చేసి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రాణదానం చేశారు.

News October 9, 2025

ఎన్నికల సిత్రాలు షురూ: ఎర్రగడ్డలో మిర్చి బజ్జీ వేసి!

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల సిత్రాలు మొదలయ్యాయి. ఓటర్లను ఆకర్షించే పనిలో BRS అభ్యర్థి మాగంటి సునీత తన దైన శైలిలో వెళుతున్నారు. బుధవారం సాయంత్రం ఎర్రగడ్డ డివిజన్‌లోని బి.శంకర్‌లాల్‌నగర్, సుల్తాన్‌నగర్‌లో కూకట్‌పల్లి MLA మాధవరం కృష్ణారావుతో కలిసి పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా ఓ హోటల్ వద్ద మిర్చి బజ్జీలు వేశారు. ఉప ఎన్నిక ప్రచారం ముగింపు వరకు ఇంకెన్ని సిత్రాలు ఉంటాయో చూడాలి.

News October 9, 2025

జీవ ఎరువుల వాడకంతో కలిగే ప్రయోజనాలు

image

పంటకు <<17939337>>జీవ ఎరువు<<>>లను అందించడం వల్ల హార్మోన్లు, విటమిన్లు మొక్కకు లభ్యమై అవి ఆరోగ్యకరంగా, వేగంగా పెరుగుతాయి. నేల నుంచి సంక్రమించే తెగుళ్లను కొంతమేర అరికట్టవచ్చు. నేల భౌతిక లక్షణాలు మెరుగుపడి భూసారం పెరుగుతుంది. రసాయన ఎరువుల వాడకం 20 నుంచి 25 శాతం మేర తగ్గించుకోవచ్చు. జీవ ఎరువుల వల్ల పంట సాధారణ దిగుబడి 10 నుంచి 20 శాతం వరకు పెరుగుతుంది. వాతావరణ కాలుష్యం తగ్గుతుంది.