News December 2, 2025
ADB: ‘చేతులు’ కలిశాయ్.. నేతలు ఒకటైనట్టేనా..?

జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలకు చెక్ పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. DCCఅధ్యక్షుడిగా నరేష్ జాదవ్ నియామకం, ఈనెల 4న CM రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నేతలంతా ఏకతాటిపైకి వచ్చారు. కొంతకాలంగా మాజీ మంత్రి స్వర్గీయ సిఆర్ఆర్, కంది శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కంది శ్రీనివాస్ రెడ్డి ఆఫీసులో సోమవారం కలిశారు.
Similar News
News December 3, 2025
బుద్ధారం సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం!

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వగ్రామం బుద్ధారం సర్పంచ్గా విడిదినేని శ్రీలత అశోక్ ఏకగ్రీవమయ్యారు. సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన కొమ్మురాజు అమృతమ్మ, ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవం సాధ్యమైంది. గ్రామంలోని 12 వార్డులకు గాను, 9 వార్డులకు కూడా ఏకగ్రీవం పూర్తయింది.
News December 3, 2025
నాది కథను మలుపు తిప్పే రోల్: సంయుక్త

‘అఖండ-2’ అభిమానుల అంచనాలకు మించి ఉండబోతుందని హీరోయిన్ సంయుక్త మేనన్ అన్నారు. చిత్రంలో తన పాత్ర చాలా స్టైలిష్గా ఉంటుందని, కథను మలుపు తిప్పే రోల్ అని చెప్పారు. ఈ సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు షెడ్యూల్ బిజీగా ఉన్నా డేట్స్ అడ్జస్ట్ చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం స్వయంభు, నారీ నారీ నడుమ మురారి చిత్రాల్లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అఖండ-2 ఎల్లుండి థియేటర్లలో రిలీజ్ కానుంది.
News December 3, 2025
తేమ శాతం 17-25 వరకు ఉన్నా ధాన్యం కొంటాం: జేసీ

రేపల్లె మండలం బేతపూడి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ భావన సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా అక్కడున్న గ్రామ వ్యవసాయ సహాయకుని కొనుగోలు కేంద్రంలో నమోదైన రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న పరికరాల పనితీరుపై ఆరాతీశారు. రైతులతో వారి ఇబ్బందులు గురించి మాట్లాడారు. తేమ శాతం 17-25 వరకు ఉన్నా రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని వివరించారు.


