News March 17, 2025
ADB: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

రాజీవ్ యువ వికాస పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువత ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. అర్హులైన గిరిజన నిరుద్యోగులు tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. దరఖాస్తులను ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. వివరాలకు ఐటీడీఏ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
Similar News
News January 8, 2026
ప్రీమియర్స్ కోసం వెయిటింగ్ ‘రాజాసాబ్’!

TG: ‘రాజాసాబ్’ ప్రీమియర్స్ విషయంలో సస్పెన్స్ వీడటం లేదు. ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో ఫ్యాన్స్కు ఎదురుచూపులు తప్పడం లేదు. దీంతో బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి? ప్రీమియర్స్ ఎప్పుడు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. అప్డేట్ ఇవ్వాలంటూ మేకర్స్ను అడుగుతున్నారు. కాగా మరికాసేపట్లో రాజాసాబ్ ప్రీమియర్లపై జీవో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
News January 8, 2026
HYDలో ఇళ్లు కట్టుకునేవారికి గుడ్న్యూస్

ఇల్లు కట్టుకున్నాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేక కరెంట్, నీళ్ల కనెక్షన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా? ఇక ఆ కష్టాలకు చెక్! పర్మిషన్ గడువు ముగిసినా, ప్లాన్ ప్రకారమే కట్టిన నాన్ హైరైజ్ భవనాలకు ఓసీ ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గడువు దాటిన రెండేళ్లలోపు అప్లై చేస్తే పాత ఫీజులే, ఆ పైన అయితే కొత్త రేట్ల ప్రకారం ఛార్జీలు కట్టి సర్టిఫికెట్ పొందవచ్చు.
SHARE IT
News January 8, 2026
WNP: బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షుడిగా మన్మోహన్ రావు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వనపర్తికి చెందిన ప్రముఖ న్యాయవాది పి.మన్మోహన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా పి.వెంకట్రాంరెడ్డి ఎన్నికయ్యారు. ముఖ్య అతిథిగా బాల్ బ్యాట్మెంటిన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ, పరిశీలకుడిగా సుమన్ హాజరయ్యారు. డిప్యూటీ ఎస్ ఓ.సుధీర్ రెడ్డి, క్రీడాకారులు భాస్కర్ గౌడ్,అలీమ్, చుక్క చంద్ర శేఖర్, నరేందర్ పాల్గొన్నారు.


