News February 14, 2025
ADB: పట్టభద్రుల MLC బరిలో 56 మంది

ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.
Similar News
News January 6, 2026
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం దిక్సూచి: జనగామ కలెక్టర్

దిక్సూచి కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు వివిధ రకాల వైద్య పరీక్షలను నిర్వహించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. జనగామ జిల్లా విద్యార్థుల ఆరోగ్య సమగ్రాభివృద్ధి దిశగా జరుగుతున్న దిక్సూచి (DIKSUCHI) కార్యక్రమం అమలుపై జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశ హాల్లో సోమవారం జిల్లా కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు.
News January 6, 2026
కుంకుమ పువ్వు నుంచే ఏటా రూ.20 లక్షల ఆదాయం

ఏరోపోనిక్స్ విధానంలో తొలి విడతలో 450 గ్రాముల హై క్వాలిటీ కశ్మీరీ కుంకుమ పువ్వుల్ని సుజాతా అగర్వాల్ సాగు చేశారు. తర్వాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో ఉత్పత్తి క్రమంగా పెరిగింది. ప్రస్తుతం ఏడాదికి ఒక్కో విడతకు కిలో చొప్పున 2 విడతల్లో 2 కేజీల కుంకుమ పువ్వు ఉత్పత్తి అవుతోంది. ఇది చాలా ప్రీమియం క్వాలిటీ కావడంతో కిలోకు రూ.10 లక్షల చొప్పున ఏడాదికి రూ.20 లక్షలకు పైగా ఆదాయం వస్తోందని సుజాతా వెల్లడించారు.
News January 6, 2026
రైతులకు బయోచార్పై ఉచిత శిక్షణ: కలెక్టర్ జితేష్

భద్రాద్రి జిల్లా రైతులకు పర్యావరణహిత సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ‘బయోచార్’ తయారీపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నిపుణులు పరశురాం కైలాస్ అఖరే ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ శిబిరం సాగనుంది. నేడు ఉదయం 9:30 గంటలకు గరిమెల్లపాడులో బుధవారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో జరుగుతుందన్నారు.


