News February 26, 2026

ADB: పరిషత్ పోరు జరగకుంటే.. రూ. 450 కోట్లు గల్లంతేనా..?

image

ZPTC, MPTC ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఎన్నికలు పూర్తి చేయకపోతే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.450 కోట్ల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. BC రిజర్వేషన్ల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికలను మార్చి 2వ వారంలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 71 ZPTC, 579 MPTC స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

Similar News

News February 26, 2026

గోదావరి పుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు: సీతక్క

image

2027లో జరిగే గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, ఇప్పటి నుంచే అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. గోదావరి నదిపై నాలుగు పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పార్కింగ్ స్థలంపై దృష్టి సారించాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, ప్రత్యేక గదులు ఏర్పాటు, ప్రజల భద్రతపై చర్యలు చేపట్టాలన్నారు. పాత ఘాట్ల వద్ద అవసరమైన మరమ్మతులు చేయించాలని సూచించారు.

News February 26, 2026

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

<>సోలార్ <<>>ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(SECI) 19 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BTech/BE, CA, MBA/PGDM, MCom/BCom అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. GMకు గరిష్ఠ వయసు 55, మేనేజర్‌కు 40ఏళ్లు, మిగతా పోస్టులకు 28ఏళ్లు. స్క్రీనింగ్ టెస్ట్/ రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.seci.co.in

News February 26, 2026

ఇందిరమ్మ ఇళ్లపై కడియం శ్రీహరి సమీక్ష

image

జనగామ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి ఒక్క ఇల్లు కూడా ల్యాప్స్ కాకుండా చూడాలని, సాగునీరు అందక ఒక్క ఎకరం ఎండిపోకూడదని అధికారులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. కలెక్టర్‌ షేక్ రిజ్వాన్ బాషా, అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్‌తో సమీక్షలో ఇళ్ల పనులు వెంటనే ప్రారంభించాలని, ప్రభుత్వ భూముల వివరాలు సేకరించాలని ఆదేశించారు.