News April 11, 2026

ADB: ఫొటో కొట్టు.. రూ.1,000 పట్టు..!

image

NHAI తీసుకొచ్చిన ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ కింద హైవేలపై టోల్ ప్లాజాల వద్ద మురికిగా ఉన్న టాయిలెట్ల ఫొటోలను ‘రాజమార్గ యాత్ర’ యాప్‌లో లొకేషన్‌తో కూడిన ఫొటో అప్‌లోడ్ చేస్తే చాలు.. మీ ఫిర్యాదు నిజమని తేలితే రూ.1000 ఫాస్టాగ్ రీఛార్జ్ రివార్డుగా లభిస్తుంది. కానీ.. మీరు టోల్ ప్లాజా వద్ద ఉంటేనే ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుందని 1033 హెల్ప్ లైన్ అధికారులు తెలిపారు.

Similar News

News April 12, 2026

MHBD: విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి

image

ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో శనివారం జరిగింది. మట్వాడ శివారు నీలవంచకు చెందిన చిన్నారులు శ్రీజ(9), చైత్ర(9) చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి.

News April 12, 2026

MLG: విద్యుత్ షాక్‌తో మహిళా రైతు మృతి

image

మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడులో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఎదురుగట్ల శంకరమ్మ (35) అనే మహిళ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శంకరమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

News April 12, 2026

సింహాచలం: రేపటి నుంచి చందనోత్సవం టికెట్లు.. ఇలా బుక్ చేసుకోండి

image

ఏప్రిల్ 20న జరగనున్న సింహాచలం చందనోత్సవం టికెట్లను ఏప్రిల్ 13 నుంచి 17వరకు విక్రయించనున్నారు. భక్తుల సౌకర్యార్థం రూ.300,రూ.1000, దర్శన టికెట్లు అక్కయ్యపాలెం, సింహాచలం యూనియన్ బ్యాంక్, సింహాచలం, బిర్లా జంక్షన్ శాఖ ఎఅమ్మనున్నారు. https://chandanotsavam.ap.gov.in ద్వారా రూ. 300,రూ.1000 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి తెలిపారు.