News February 16, 2025

ADB: బాబా మాటలు నమ్మి మోసపోయిన వ్యక్తి

image

బాబా మాటలు నమ్మి ఒక వ్యక్తి మోసపోయిన ఘటన ADBలో జరిగింది. CI కరుణాకర్ ప్రకారం.. ఖుర్షీద్ నగర్‌కు చెందిన అజహర్ ఉద్దీన్‌కు మహారాష్ట్రకు చెందిన యాసీన్(జనబ్ డోంగీబాబా) పరిచయమయ్యాడు. ఆయన అజహర్‌కు మాయమాటలు చెప్పి తన వద్ద తాయత్తు తీసుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మించాడు. అయితే తాయత్తు తీసుకున్న అనంతరం ఇంట్లో గొడవలు ప్రారంభం కావడంతో తనను బాబా మోసం చేశాడంటూ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Similar News

News February 17, 2026

ఏఐ సాయంతో పిటిషన్లు.. సీజేఐ ఆందోళన

image

న్యాయవ్యవస్థలో ఏఐ వాడకంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు న్యాయవాదులు పిటిషన్లను ఏఐ సాయంతో రూపొందిస్తున్నారని పేర్కొంది. కల్పిత కేసులు/చట్టాలు, ఉనికిలో లేని జుడీషియల్ కోట్స్‌ను సమర్పిస్తున్నారని తెలిపింది. దీనివల్ల న్యాయ ప్రక్రియ సమగ్రత, నైతికతకు ముప్పు కలుగుతుందని, వృత్తిపరమైన సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరించింది. ఈ రంగంలో ఏఐ వినియోగంపై నియంత్రణ అవసరమంది.

News February 17, 2026

తిరుపతి SVIMSలో ఉద్యోగాలు

image

తిరుపతిలోని <>SVIMS<<>> 26 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు ఈ నెల 19, 20, 21, 22, 23తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS, BDS, డిగ్రీ( సోషల్ వర్క్), BSc(నర్సింగ్), ANM, డిప్లొమా(మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ), పీజీ డిప్లొమా(రేడియోగ్రఫీ, కార్డియో వాస్క్యులార్ టెక్నాలజీ), DMLT, టెన్త్, ITI అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 ఏళ్లు (రిజర్వేషన్ గలవారికి సడలింపు).

News February 17, 2026

‘పచ్చిమేత’ పాడి పశువుల పోషణలో ముఖ్యం

image

పచ్చి మేతలో విటమిన్-A అధికంగా ఉంటుంది. దీని వల్ల పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండి సకాలంలో యుక్త వయసుకు వచ్చి యద లక్షణాలు చూపించి చూలు కడతాయి. రైతు తనకున్న పొలంలో 1/10 వంతులో పశుగ్రాసాన్ని సాగు చేస్తే పశువుల పోషణ ఖర్చు 25-30 శాతం తగ్గి.. పాల నుంచి వచ్చే ఆదాయం 20-30% వరకు పెరుగుతుంది. పచ్చిమేత వల్ల పశువుల జీర్ణక్రియ మెరుగ్గా జరిగి పోషకాలు బాగా అంది పాల దిగుబడి కూడా పెరుగుతుంది.