News March 11, 2025

ADB: బిహార్ ముఠా.. నిందితుల వివరాలు

image

ఆదిలాబాద్ జిల్లాలో పాత మొబైల్ ఫోన్లకు ఆయా వస్తువులు అమ్ముతున్న <<15720691>>బిహార్ ముఠా<<>> వివరాలను మంగళవారం పోలీసులు వెల్లడించారు. A1గా తబరాక్, A2 మొహమ్మద్ మెరాజుల్, A3 మహబూబ్ ఆలం, A4 మొహమ్మద్ జమాల్, A5 ఉజీర్, A6గా అబ్దుల్లాగా గుర్తించారు. దీంతో సోమవారం సాయంత్రం బస్సు స్టాండ్ సరిహద్దుల్లో A3 నుంచి A6 వరకు మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 12, 2025

‘ప్రశక్తి’ అవార్డుకు నార్నూర్ ఎంపిక

image

దేశ రాజధాని ఢిల్లీ నుంచి DAPRG అదనపు కార్యదర్శులు కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ బ్లాక్‌లలో అమలు చేసిన చర్యలు, ముఖ్య విజయాలను స్క్రీనింగ్ కమిటీకి కలెక్టర్ సమర్పించారు. దీంతో నార్నూర్ బ్లాక్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం కేటగిరిలో ప్రధానమంత్రి ‘ప్రశక్తి’ అవార్డు-2024 రెండో రౌండుకు ఎంపికైందన్నారు.

News March 12, 2025

గ్రూప్‌2 ఫలితాల్లో.. ADB వాసికి STATE 5TH ర్యాంక్

image

గ్రూప్‌2 ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకులు సత్తా చాటారు. ఇందులో భాగంగా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన చింతలపల్లి వెంకట్ రెడ్డి కుమారుడు చింతలపల్లి ప్రీతంరెడ్డి గ్రూప్‌2 ఫలితాల్లో 431 మార్కులు సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు స్థానంలో నిలిచారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు.

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. ఆదిలాబాద్‌కు ఏం కావాలంటే..!

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కోరాట చనాక ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించి పూర్తిచేయాలని, కుప్టి ప్రాజెక్ట్‌ ప్రారంభించాలని కోరుతున్నారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించి పునఃప్రారంభిస్తే ఎందరికో ఉపాధి దొరుకుతుంది. బోథ్‌కు రెవెన్యూ డివిజన్ ప్రకటనపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

error: Content is protected !!