News April 5, 2024

ADB: బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి నియామకం ఎప్పుడు..?

image

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ఇప్పటికే MP అభ్యర్థులను ప్రకటించాయి. వారితో పాటు నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా BJP.. MLA పాయల్ శంకర్‌ను, కాంగ్రెస్ పార్టీ మంత్రి సీతక్కను నియమించింది. BRS పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించినప్పటికి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఇంకా ఎవరిని నియమించలేదు. ఒకవైపు జోగు రామన్న పేరు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈనెల 5 తర్వాత ఈ విషయంపై స్పష్టత రావచ్చని సమాచారం.

Similar News

News February 12, 2026

ADB: ఓటర్ల చెంతకు వాహనం.. కలెక్టర్ రాజర్షి షా చొరవ

image

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఓటరు తన ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు పోలింగ్ కేంద్రాలకు సులభంగా చేరుకునేలా ఉచిత వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్లను ఇంటి వద్ద నుంచే పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి, తిరిగి సురక్షితంగా ఇంటికి చేర్చారు.

News February 11, 2026

బోథ్ అడవుల్లో పులుల సంచారం

image

బోథ్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి, చిరుత సంచారం కలకలం రేపుతోంది. పుణ్య నాయక్ తండాలో పవర్ సక్రుకు చెందిన ఆవుపై పులి దాడి చేసి చంపింది. అటవీ అధికారులు ప్రశాంత్ పాటిల్, విశ్వనాధ్ రెడ్డి ఘటనా స్థలిని పరిశీలించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, విద్యుత్ కంచెలు వేయవద్దని హెచ్చరించారు. అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News February 10, 2026

ADB: ఈ నెల 20 వరకు పత్తి కొనుగోళ్లు

image

సీసీఐ కేంద్రాలలో కొనుగోలు చేస్తున్న పత్తి ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి తెలిపారు. రైతులు పత్తి అమ్మెందుకు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొవాలని సూచించారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రైతులకు వీలులేదన్నారు. పత్తి నిల్వ ఉన్న రైతులు తప్పకుండా త్వరగా సీసీఐలో విక్రయించి మద్దతు ధర పొందాలని వివరించారు.