News October 14, 2025
ADB: బెస్ట్గా నిలవాలంటే.. బకాయిలు ఇవ్వాల్సిందే

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలు వెంటనే విడుదల చేసి, ఆ స్కూల్స్ యథావిధిగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. రెండున్నర సంవత్సరాలుగా స్కూల్ యాజమాన్యాలకు బిల్లులు విడుదల కాకపోవడంతో పిల్లలను బడుల్లోకి రానీయడం లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 15+ స్కూల్స్లో విద్యార్థులు చదువుకుంటున్నారు. బకాయిలు ఇవ్వాలని కోరుతున్నారు.
Similar News
News October 14, 2025
ప్రకాశంలో ఒక్కరోజే ఐదుగురి మృతి

ప్రకాశంలో నిన్న విషాద ఘటనలు జరిగాయి. ఒంగోలు సమీపంలో తెల్లవారుజామున బస్సు బోల్తా పడి ఒకరు చనిపోగా, 13మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా రిమ్స్ నుంచి మరో వైద్యశాలకు తరలించారు. <<17997659>>CSపురం<<>>, <<17998375>>కొనకనమిట్ల <<>>వద్ద రాత్రి గంటల వ్యవధిలో రెండు ప్రమాదంలో జరిగాయి. ఆ రెండు ఏరియాల్లో ఇద్దరేసి చొప్పున నలుగురు ప్రాణాలు వదిలారు.
News October 14, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

దీపావళి ముంగిట బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 3,280 పెరిగి రూ.1,28,680కు చేరింది. 10 రోజుల్లోనే రూ.9,280 పెరగడం గమనార్హం. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,000 పెరిగి రూ.1,17,950గా ఉంది. అలాగే కేజీ వెండిపై రూ.9,000 ఎగబాకి తొలిసారి రూ.2,06,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 14, 2025
కొత్తగూడెంకు ముగ్గురు కొత్త ఎంపీడీవోలు.. త్వరలో పోస్టింగ్

గ్రూప్-1 ద్వారా ఎంపికైన వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ముగ్గురు ఎంపీడీవోలను సర్కారు కేటాయించింది. నూతన ఎంపీడీవోలుగా పోటు సంకీర్త, పూరేటి అజయ్, ఎనిక హరికృష్ణ నియమితులయ్యారు. వీరు ఆయా జడ్పీ కార్యాలయాల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఉన్నతాధికారులు వీరికి పోస్టింగులు ఇస్తారని అధికారులు వెల్లడించారు.