News March 24, 2024

ADB: మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ

image

కాలినడకన వెళ్తున్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్ళిన సంఘటన శనివారం సాయంత్రం ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. జైనథ్ మండలం కూర గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ స్ధానిక పంజాబ్ చౌక్ వద్ద బస్సు దిగి భూక్తాపూర్‌లోని బంధువుల ఇంటికి కాలినడకన వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన అగంతకుడు అకస్మాత్తుగా రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. బాధితురాలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News October 24, 2025

ఆదిలాబాద్: పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్‌ విడుదల

image

పదో తరగతి ఫైనల్‌ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ప్రకటించిందని DEO ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. అక్టోబరు 30 నుంచి నవంబర్‌ 13 లోపు పాఠశాల హెడ్‌మాస్టర్లకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. HMలు ఆన్‌లైన్‌ ద్వారా నవంబర్‌ 14 లోపు ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డేటాను నవంబర్‌ 18లోపు అందించాలని సూచించారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్‌ 29 వరకు అవకాశం ఉందన్నారు.

News October 23, 2025

5K రన్ విజయవంతం చేయండి: ఆదిలాబాద్ SP

image

ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అమరవీరుల జ్ఞాపకార్ధం శుక్రవారం ఉదయం 5.30 గంటలకు 5k రన్ నిర్వహించనున్నట్లు SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ప్రజలు, యువత, విద్యార్థులు, పోలీసు శ్రేయోభిలాషులు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్టేడియం నుంచి ప్రారంభమై కలెక్టర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌక్, వినాయక చౌక్, నేతాజీ చౌక్, అంబేడ్కర్ చౌక్ మీదుగా తిరిగి స్టేడియం చేరుకుంటుందన్నారు.

News October 23, 2025

ఆదిలాబాద్: ’26లోపు కొటేషన్లు సమర్పించాలి’

image

ADB జిల్లాలోని15 ప్రీ-ప్రైమరీ పాఠశాలల కోసం ఫర్నీచర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లెర్నింగ్ మెటీరియల్ పెయింటింగ్ పని, కొనుగోలు నిమిత్తం స్థానిక ఫర్ముల నుంచి సీల్ చేసిన కోటేషన్లకు ఆహ్వానిస్తున్నట్లు DEO ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. ఆసక్తి గల స్థానిక ఫర్ములు లేదా సరఫరాదారులు, సంబంధిత వివరాల అవసరాల జాబితా కోసం డీఈఓ క్వాలిటీ కోఆర్డినేటర్ ను సంప్రదించాలన్నారు. కోటేషన్లు ఈనెల 26లోపు సమర్పించాలన్నారు