News March 5, 2025
ADB: ముగిసిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

ఉమ్మడి KNR, ADB, NZB, MDK ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో భాగంగా 11వ రౌండ్తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 11వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,935 (75,675), కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 4,387 (70,565), బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 3,473(60,419) ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి 5,110 లీడింగ్లో కొనసాగుతున్నారు.
Similar News
News March 6, 2025
సిరికొండలో విద్యుత్ షాక్తో యువకుడి మృతి

విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన సిరికోండలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివరాం వివరాల ప్రకారం.. తుమ్మలపాడ్ గ్రామానికి చెందిన విలాస్(28) ఇంటి గోడకున్నా విద్యుత్ వైర్ షాక్ తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. విలాస్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
News March 6, 2025
ఆదిలాబాద్: ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్ సమీక్ష

ADB కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్లపై సంబంధిత మండలాల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సమీక్ష నిర్వహించారు. 17 మండలాల్లోని 17 గ్రామపంచాయితీల్లో ఎంపికైన 2,148 ఇళ్లకు మార్కింగ్ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మిగిలిన అన్ని గ్రామాల్లోని ఇళ్లకు సంబందించిన వెరిఫికేషన్ ప్రక్రియను ఈ నెల 7లోగా పూర్తిచేసి నివేదిక సమర్పించాలన్నారు. అభివృద్ధి పనులకు సంబందించిన ఎస్టిమేట్స్ సిద్ధం చేయాలని సూచించారు.
News March 5, 2025
ఆదిలాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

■ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం
■ గాంధీ భవన్లో ఆదిలాబాద్ నాయకులతో సమీక్షా సమావేశం
■ ఆదిలాబాద్కు ఏయిర్ పోర్ట్ తీసుకొస్తా: ఎంపీ
■ జోగురామన్న వ్యాఖ్యలను ఖండించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే
■ మహారాష్ట్రలో యాక్సిడెంట్.. 16 మంది జిల్లా వాసులకు గాయాలు
■ BJPలో చేరిన సాత్నాల గ్రామస్థులు
■ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి