News February 15, 2025

ADB: యువకుడిపై అడవి పంది దాడి

image

ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్ర శివారు ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర శనివారం ఉదయం విష్ణు అనే యువకుడి పై అడవి పంది దాడి చేసి గాయపరిచింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంక్ నుంచి సొనాల వైపు వెళుతుండగా బ్రిడ్జి దగ్గర ఉన్న అడవి పంది ఒక్కసారి పైకి వచ్చి దాడి చేసింది. దానిని ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో పారిపోయిందన్నారు. తృటిలో ప్రాణాపాయం తప్పిందన్నారు.

Similar News

News March 13, 2025

అంతర్జాతీయ కళాపోటీల్లో ADB వాసికి అవార్డ్

image

దేశంలోని కళాకారులు, 5 దేశాలకు పైగా NRIల మధ్య నిర్వహించిన సెషన్ 16వ అంతర్జాతీయ కళాపోటీల్లో ADB టీచర్స్ కాలనీకి చెందిన గాధరి చంద్రశేఖర్ ప్రతిభ కనబర్చాడు. ఇన్నోవిజే గ్లోబల్ టాలెంట్ సెర్చ్ ర్యాంక్ స్లాట్ ప్రకారం ఐఏసీ నుంచి డ్రాయింగ్, పెయింటింగ్ విభాగంలో ది మెడల్ ఆఫ్ అప్రిషియేషన్‌తో పాటు ది లెటర్ ఆఫ్ రికగ్నిషన్ లెవల్-2లో అవార్డు అందుకున్నాడు. అర్హులైన కళాకారుల్లో ఒకరిగా పేరు సాధించుకున్నారు.

News March 13, 2025

ADB: సెకండియర్ పరీక్షకు 386 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ మ్యాథమెటిక్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షకు మొత్తం 9,088కి 8,702 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ గణేశ్ జాదవ్ తెలిపారు. 386 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.

News March 12, 2025

‘ప్రశక్తి’ అవార్డుకు నార్నూర్ ఎంపిక

image

దేశ రాజధాని ఢిల్లీ నుంచి DAPRG అదనపు కార్యదర్శులు కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ బ్లాక్‌లలో అమలు చేసిన చర్యలు, ముఖ్య విజయాలను స్క్రీనింగ్ కమిటీకి కలెక్టర్ సమర్పించారు. దీంతో నార్నూర్ బ్లాక్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం కేటగిరిలో ప్రధానమంత్రి ‘ప్రశక్తి’ అవార్డు-2024 రెండో రౌండుకు ఎంపికైందన్నారు.

error: Content is protected !!