News April 19, 2024
ADB: రిమ్స్ పార్కింగ్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో గల పార్కింగ్ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం గుర్తించారు. వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని గమనించిన వారు అవుట్ పోస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి వద్ద బంగారిగూడ పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి ఫొటో మాత్రమే లభించిందని ఇతర వివరాలేవీ ఆయన వద్ద లేవని అవుట్ పోస్ట్ ఇన్ఛార్జ్ భూమన్న తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు.
Similar News
News February 14, 2026
ADB: పుర పీఠం.. బద్ధ శత్రువుల’ కలయిక నిజమేనా?

ADB మున్సిపాలిటీలో ఛైర్మన్ పీఠం దక్కించుకోవడం ప్రధాన పార్టీలకు సవాలుగా మారింది. మొత్తం 51 స్థానాలకు గాను మేజిక్ ఫిగర్ 26 కాగా, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. కాంగ్రెస్(11), BRS(6), MIM(6) కలిసినా మెజారిటీకి ఇంకా ముగ్గురు స్వతంత్రుల మద్దతు అవసరం. మరోవైపు స్వతంత్రులు తమ వెంటే ఉన్నారని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. పరస్పర విరుద్ధ భావజాలం గల పార్టీలు పీఠం కోసం జతకడతాయా అన్నది వేచి చూడాలి.
News February 14, 2026
ఆదిలాబాద్: కువైట్ నుంచి వచ్చి.. కౌన్సిలర్గా గెలిచి

ఆదిలాబాద్ కువైట్లో సుదీర్ఘకాలం పనిచేసిన మెహబూబ్ 33వ వార్డులో విజయం సాధించారు. విదేశాల్లో ఉన్నప్పుడు ‘గోల్డెన్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్’ ద్వారా భారతీయుల సమస్యలపై పోరాడారు. స్వగ్రామంపై మక్కువతో ఎన్నికల బరిలో నిలిచి ఓటర్ల ఆదరణ పొందారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. సేవా దృక్పథమే తనను గెలిపించిందని మెహబూబ్ పేర్కొన్నారు.
News February 13, 2026
ఉట్నూర్: 4KGల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్

నమ్మదగిన సమాచారంతో ఇంద్రవెల్లి పోలీసులు శ్మశానవాటిక వద్ద నిఘా ఉంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కొడప రమేష్, కుంర గంగారం, కుముర కృష్ణల వద్ద నుంచి 4కిలోల గంజాయి, మోటార్ సైకిల్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను ఉట్నూర్ కోర్టులో రిమాండ్ చేసినట్లు ఎస్ఐ సాయన్న వెల్లడించారు.


