News August 26, 2024
ADB: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

ముంబాయి-బల్లార్ష మధ్య నడిచే నందిగ్రాం ఎక్స్ప్రెస్ 28, 29 తేదీల్లో ఆదిలాబాద్ వరకే పరిమితం కానుందని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నాగపూర్ డివిజన్లో మరమ్మతుల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది. 28న సీఎస్ ముంబయి నుంచి బయలుదేరే రైలు(నెంబరు 11401) ఆదిలాబాద్లో నిలిపివేయునున్నట్లు పేర్కొంది. 29న నందిగ్రామ్ రైలు(నెంబరు 11402) ఆదిలాబాద్ నుంచి బయలుదేరి ముంబయికి బయలుదేరనుంది.
Similar News
News February 17, 2026
రేపు సెలవు కానీ పరీక్షలు యథాతథం: ADB కలెక్టర్

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 18న జిల్లాలో స్థానిక సెలవు ప్రకటించబడినప్పటికీ, అదే రోజున నిర్వహించాల్సిన ఎస్సెస్సీ ప్రీ–ఫైనల్ పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయబడవన్నారు. జిల్లాలోని MEOలు, HMలు, SOలు, TGMS ప్రిన్సిపల్స్ పరీక్షలు నిర్ణీత టైమ్టేబుల్ ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News February 17, 2026
కాగజ్నగర్లో SP అఖిల్ తనిఖీలు

కాగజ్నగర్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ తనిఖీ చేసి బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయం, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్పీ అఖిల్ తెలిపారు.
News February 16, 2026
BREAKING: కాంగ్రెస్లోకి ADB మున్సిపల్ ఛైర్పర్సన్

ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సరైన దేనని ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల పార్లమెంట్ ఇన్ఛార్జ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్గా ఎన్నికైన బండారి అనూష సోమవారం నిజామాబాద్లోని ఆయన నివాసంలో కాంగ్రెస్లో చేరారు. వారిని అభినందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.


