News October 26, 2025

ADB: సీనియర్లు.. ర్యాగింగ్ భూతాలు

image

ర్యాగింగ్ భూతం విద్యార్థులను అవస్థల పాలుచేస్తోంది. తోటి విద్యార్థులతో స్నేహభావంగా మెలగాల్సిన సీనియర్లు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. గతంలో మేడ్చల్ జిల్లాలో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సీనియర్ల వేధింపులు తాళలేక ఉట్నూర్‌కు చెందిన విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. తాజాగా ఖానాపూర్‌లో మరో ఘటన కలకలం రేపింది. వేధింపులకు పాల్పడే సీనియర్లపై ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News October 26, 2025

కుక్క కరిచిన నెల తర్వాత చిన్నారి మృతి

image

TG: నిజామాబాద్(D) బాల్కొండకు చెందిన గడ్డం లక్షణ(10) అనే బాలిక కుక్క కరిచిన నెల తర్వాత మరణించింది. కుక్క గీరడంతో ఆమె తలకు గాయమైంది. ఇంట్లో చెబితే తిడతారనే భయంతో చెప్పలేదు. 3 రోజుల క్రితం కుక్కలా అరుస్తూ వింతగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేబిస్ వ్యాధి తీవ్రమై చనిపోయిందని వైద్యులు తెలిపారు. కుక్క కరిచిన వెంటనే రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News October 26, 2025

ASF: ఢిల్లీకి చేరిన జాబితా.. ఎవరి ధీమా వారిదే!

image

తెలంగాణ రాష్ట్ర డీసీసీల జాబితా ఢిల్లీకి చేరింది. CM రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో డీసీసీల జాబితాను ఢిల్లీ పెద్దలకు అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ పదవిపై ఎవరి ధీమా వారికే ఉంది. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ఎవరికి వారే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News October 26, 2025

కాకినాడ: విద్యాసంస్థలకు ఐదు రోజుల సెలవులు

image

తుపాను నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు 26వ తేదీ సాయంత్రం నాటికి ఇళ్లకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ఐదు రోజులు ఏ ఒక్క విద్యాసంస్థ తెరిచి ఉండకూడదని, కళాశాలలకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.