News October 10, 2025
ADB: స.హ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఆర్టీఐ చట్టాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్యామలదేవి అన్నారు. శుక్రవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సమాచారం పొందే హక్కు గురించి పౌరులలో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 5 నుంచి 12 వరకు RTI వారోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
Similar News
News October 11, 2025
రౌడీ షీటర్ల ప్రవర్తనను పరిశీలించాలి: ADB SP

రౌడీ షీటర్ల, సస్పెక్ట్ షీటర్ల ప్రవర్తనను ప్రతివారం పరిశీలించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా పోలీసులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న గన్ లైసెన్సులపై శుక్రవారం సమీక్ష సమావేశంలో మాట్లాడారు. శాంతి భద్రతలకు ఇబ్బందులు కలిగించే వారి వివరాలు తీసుకొని బైండోవర్ చేయాలన్నారు. సన్మార్గంలో ఉన్న, ప్రవర్తన మార్చుకున్న రౌడీలపై రౌడీ షీట్ ఎత్తివేయాలని సూచించారు. నేర పరిశోధనలో మరింత అప్రమత్తతో ఉండాలన్నారు.
News October 11, 2025
ఆదిలాబాద్: సోమవారం యథావిధిగా ప్రజావాణి

ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం వచ్చే సోమవారం నుంచి కలెక్టరేట్లో యథావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఇదివరకు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణిని తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. ప్రజలు వినతులను స్వీకరించేందుకు ప్రజావాణిని తిరిగి నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
News October 10, 2025
ఆదిలాబాద్: ITI, ATCలో 5వ విడత అడ్మిషన్లు

ప్రభుత్వ ప్రైవేట్ ITI, ATCలలో ప్రవేశాల కోసం 5వ విడత వాక్-ఇన్ అడ్మిషన్స్ చేపడుతున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 17 వరకు ఈ అవకాశం ఉందన్నారు. ప్రవేశాలు పూర్తిగా మెరిట్ ఆధారంగా, సీట్లు అందుబాటులో ఉన్న మేరకు మాత్రమే కేటాయిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కళాశాలలో హాజరు కావాలని సూచించారు.