News August 13, 2025

ADB: హర్ ఘర్ తిరంగా ప్రచారం

image

మిషన్ శక్తి – DHEW బృందం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని పలు విద్యాసంస్థల్లో బుధవారం హర్ ఘర్ తిరంగా ప్రచారం కార్యక్రమంతో పాటు అవగాహన సదస్సు నిర్వహించారు. పౌరులు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రోత్సహించే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని చేపట్టినట్లు జిల్లా మిషన్ కోఆర్డినేటర్ యశోద తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా దేశభక్తి భావాన్ని పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

Similar News

News August 14, 2025

ADB: ఫలితాలు విడుదల.. నలుగురే PASS

image

జిల్లాకేంద్రంలోని టీటీడీసీలో 50 రోజుల లైసెన్స్ సర్వేయర్స్ శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే. శిక్షణ పూర్తి అనంతరం గత నెల 27, 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. కాగా వాటి ఫలితాలు బుధవారం విడుదల చేశారు. 155 మందికి కేవలం నలుగురే పాస్ అయ్యారు. 100కి 60 శాతానికి పాస్ పర్సంటేజ్ కావడంతో దానిని 50 శాతానికి తగ్గించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

News August 14, 2025

ADB: ‘సీఐ కరుణాకర్ సేవలు అభినందనీయం’

image

ADB టూ టౌన్ సీఐగా కరుణాకర్ రావు అందించిన సేవలు అభినందనీయమని డీఎస్పీ జీవన్‌రెడ్డి కొనియాడారు. బుధవారం సాయంత్రం ఘన్‌పూర్ సర్కిల్‌కు బదిలీపై వెళ్తున్న కరుణాకర్ రావుకు డీఎస్పీతో పాటు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, ఎస్సై విష్ణుప్రకాష్ ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు కరుణాకర్‌రావు తీసుకున్న చర్యలు అమోఘమని ప్రశంసించారు.

News August 13, 2025

రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఆదిలాబాద్ ఎంపీ

image

ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బుధవారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. 5th షెడ్యూల్ ప్రాంత పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించాలని ఎంపీ కోరారు. స్పందించిన గవర్నర్ వర్షాకాలం తర్వాత టూర్ పెడతానని తెలిపారన్నారు. అనంతరం గిరిజన ఉద్యోగ సంఘ బాధ్యులు గిరిజన ప్రాంత సమస్యల గురించి వినతిపత్రం అందజేశారు.