News May 11, 2024
ADB: 16 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

పార్లమెంట్ ఎన్నికల విధులకు సంబందించి ఈ నెల 1 నుంచి 3 వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రెండో విడుత శిక్షణకు గైర్హాజరైన 16 మంది ఉపాధ్యాయులకు కలెక్టర్ రాజర్షి షా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారంతా నోటిసులు అందిన 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఉపాద్యాయులు ఇచ్చే సంజాయిషి ఆధారంగా తగిన చర్యలు తీసుకొనే అవకాశం ఉందన్నారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 14, 2025
ADB: పట్టభద్రుల MLC బరిలో 56 మంది

ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.
News February 14, 2025
ADB: ఆధార్ సెంటర్ పర్యవేక్షించిన UIDAI అధికారి

రాష్ట్ర UIDAI ఆఫీస్ హైదరాబాద్ ప్రాజెక్ట్ మేనేజర్ నరేశ్ చంద్ర గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలోని ఆధార్ సెంటర్, ఈ సేవా ఆధార్ సెంటర్ని తనిఖీ చేశారు. ఆధార్ ఎన్రోల్మెంట్ వివరాలను, రికార్డ్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. తనిఖీలో EDM రవి, మీసేవ ఫ్రాంచైజీ ఓనర్ తన్వీర్, జోగు సాగర్, స్వాగత, దయాకర్, శేషగిరి ఉన్నారు.
News February 14, 2025
సారంగాపూర్: పాముకాటుతో 18 నెలల బాలుడి మృతి

సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్కు చెందిన 18 నెలల విహాంత్ అనే బాలుడికి పాము కాటు వేయడంతో గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఆరుబయట అక్కతో ఆడుకుంటున్న విహాంత్ ఇంటి పక్కన ఉన్న పొద నుంచి వచ్చిన పాము బాలుణ్ని కాటు వేసింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.