News May 11, 2024

ADB: 16 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

image

పార్లమెంట్ ఎన్నికల విధులకు సంబందించి ఈ నెల 1 నుంచి 3 వరకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రెండో విడుత శిక్షణకు గైర్హాజరైన 16 మంది ఉపాధ్యాయులకు కలెక్టర్ రాజర్షి షా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారంతా నోటిసులు అందిన 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఉపాద్యాయులు ఇచ్చే సంజాయిషి ఆధారంగా తగిన చర్యలు తీసుకొనే అవకాశం ఉందన్నారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News February 27, 2026

ఆదిలాబాద్: ఇంటర్ ఇంగ్లీష్ పరీక్షకు 491 గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా ముగియగా మొత్తం 9,226 మంది విద్యార్థులకు 8,735 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 8,204 మందికి 366 మంది విద్యార్థులు, వొకేషనల్ విభాగంలో 1,022 విద్యార్థులకు 125 మంది విద్యార్థులు, మొత్తం 491 మంది ఎగ్జామ్‌కు గైర్హాజరైనట్లు DIEO జాదవ్ గణేశ్ కుమార్ వెల్లడించారు.

News February 27, 2026

ఆదిలాబాద్: MAR 10న మెగా JOB మేళా..!

image

పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతతోపాటు ఆదివాసీ యువత అభివృద్ధి కోసం MAR 10న ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మెగా JOB మేళా నిర్వహించనుండటం అభినందనీయమని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జాబ్ మేళా పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో 50కిపైగా కంపెనీల ద్వారా 2వేలకుపైగా ఉద్యోగాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. SHARE.

News February 26, 2026

‘బాల్యవివాహ రహిత జిల్లాగా నిలిపేందుకు పునరంకితం కావాలి’

image

ఆదిలాబాద్ జిల్లాను బాల్యవివాహ రహితంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. బాల్యవివాహ నిరోధక అధికారులకు నిర్వహించిన అభయ అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. గ్రామ, పట్టణాలలో బాలల సంరక్షణ కమిటీలు ప్రతినెలా విధిగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. బాల్యవివాహ రహిత జిల్లాగా నిలిపేందుకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ కోరారు.