News June 2, 2024
ADB: 3రోజుల్లో ఫలితాలు.. అభ్యర్థుల్లో TENSION

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మరో మూడురోజుల్లో వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం జిల్లా కేంద్రంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయినప్పటి నుంచి పోలీస్ అధికారుల నడుమ 24 గంటలపాటు భద్రత కొనసాగుతోంది. కాగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. అటు ఎంపీ అభ్యర్థుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
Similar News
News September 19, 2025
ఆదిలాబాద్: ఏఎస్పీ కాజల్ సింగ్కు పదోన్నతి

ఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న కాజల్ సింగ్ ఎస్పీగా పదోన్నతి రాగా శుక్రవారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందనలు తెలిపారు. అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన కాజల్ సింగ్కు శుభాకాంక్షలు తెలిపారు. భుజస్కందాలపై సింహ తలాటం చిహ్నాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్ రెడ్డి, కమతం ఇంద్రవర్ధన్ పాల్గొన్నారు.
News September 19, 2025
గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి కృషి చేయాలి: ADB ఎస్పీ

గంజాయి రహిత జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. వీడీసీల ఆగడాలను పూర్తిస్థాయిలో అరికట్టాలన్నారు. రౌడీలు, కేడీలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా కఠినమైన పర్యవేక్షణ చేయాలని సూచించారు. దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.
News September 19, 2025
అసాంఘిక కార్యకలాపాలను రూపమాపాలి: ADB ఎస్పీ

రానున్న నవరాత్రి ఉత్సవాలకు జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తి సంసిద్ధమై ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్లో జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యచరణను అవలంభించాలని సూచించారు. అందులో భాగంగానే కల్తీకల్లు, ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్, మట్కా లాంటి వాటిని పూర్తిగా రూపమాపేలా కృషి చేయాలన్నారు.