News February 25, 2025
ADB: 3 రోజులు పత్తి కొనుగోలు బంద్

ఈ నెల 26, 27, 28 తేదీల్లో జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిపివేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మంగళవారం తెలిపారు. 26న మహాశివరాత్రి, 27న ఎమ్మెల్సీ ఎన్నికలు, 28న అమావాస్య ఉన్నందున కొనుగోళ్లు జరగవని వెల్లడించారు. మార్చి 1నుంచి కొనుగోళ్లు యథావిధిగా జరుగుతాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
Similar News
News December 17, 2025
ఒక్క ఓటుతో మూత్నూర్ తండా సర్పంచ్గా జాదవ్ రాంజీ

గుడిహత్నూర్ మండలంలోని మూత్నూర్ తండా గ్రామ సర్పంచ్గా జాదవ్ రాంజీ నాయక్ విజయం సాధించారు. సమీప అభ్యర్థిపై 1 ఓటు తేడాతో గెలుపొందారు. ప్రజల సమస్యల పరిస్కారానికి తన వంతు కృషి చేస్తూ.. ప్రతి క్షణం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
News December 17, 2025
ADB: ‘కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమాన్ని విజయవంతం చేయండి’

ఈనెల 18వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంను విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ కోరారు. ఆశ కార్యకర్తతో కూడిన బృందం ఈ ఉద్యమంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శించి అందరిని పరీక్షించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 1002 బృందాలు ఈ సర్వేలో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ప్రజలు అందరు తమ ఇంటికి వచ్చే సర్వే బృందాలకు సహకరించాలని కోరారు.
News December 17, 2025
ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విజయం మహిళదే

మూడో విడత స్థానిక ఎన్నికల్లో భాగంగా తలమడుగు మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీల్లో బుధవారం సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పల్లి-కే సర్పంచ్గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గుమ్ముల లక్ష్మి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి తొడసం రుక్మా బాయిపై 39 ఓట్ల తేడాతో గెలుపొందారు. 29 గ్రామ పంచాయతీలు ఉండగా.. 7 ఏకగ్రీవం అయ్యాయి.


