News February 11, 2025
ADB: 7ఏళ్లయినా ఉద్యోగం ఇవ్వట్లేదని వాపోయిన యువతులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739191911365_50249255-normal-WIFI.webp)
స్టాఫ్ నర్సింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన తమకు ఉద్యోగం ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు. ఈ విషయమై సోమవారం ఉట్నూర్, గాదిగుడా నుంచి బాధితులు శైలజ, విజయలక్ష్మి, నీల ప్రజావాణికి వచ్చారు. అదనపు కలెక్టర్ శ్యామలదేవిని కలిసి విన్నవించారు. ట్రైనింగ్ పూర్తి చేసి 7 సంవత్సరాలు అవుతుందన్నారు. కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ పోస్ట్కి దరఖాస్తు చేసుకున్నా తమకు ఉద్యోగం ఇవ్వడం లేదని వాపోయారు.
Similar News
News February 12, 2025
ADB వాసికి అంతర్జాతీయ అవార్డు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739278593347_20476851-normal-WIFI.webp)
అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ డిస్క్రిప్షన్ డైరెక్టర్గా ADBకు చెందిన ప్రముఖ సినీ డైరెక్టర్ ఫహీం సర్కార్ అవార్డు అందుకున్నారు. మంగళవారం HYDలో జరిగిన చలనచిత్ర ఉత్సవంలో భాగంగా సినిమా, టీవీ రంగాల్లో పలు విభాగాలలో అందించిన అంతర్జాతీయ అవార్డుల పురస్కారంలో భాగంగా బెస్ట్ డిస్క్రిప్షన్ డైరెక్టర్ డైరెక్టర్గా ఫహీం సర్కార్ అవార్డు అందుకున్నారు.
News February 12, 2025
ADB: పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్.. APPLY NOW
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739288972758_71671682-normal-WIFI.webp)
2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్, డిగ్రీ చదువుతున్న SC, ST, BC, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ADB జిల్లా SC అభివృద్ధి శాఖాధికారి బి.సునీత కుమారి మంగళవారం ప్రకటనలో తెలిపారు. రెన్యూవల్, కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులు E-Pass ఆన్ లైన్లో మార్చి 31 లోపుగా సమర్పించాలన్నారు.
News February 12, 2025
ADB: క్షయ వ్యాధి రహిత సమాజ నిర్మాణానికి కృషి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739281276989_20476851-normal-WIFI.webp)
క్షయ వ్యాధి (టీబీ) రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేయాలని ఆదిలాబాద్ జిల్లా క్షయ వ్యాధి నివారణాధికారి సుమలత అన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన ఆక్యు పంచర్ స్పెషలిస్ట్ డాక్టర్ కిరణ్, మంజునాథ్, రఘు ఆయుర్వేద, ఆక్యు పంచర్ వైద్య విధానంలోని పలు అంశాలపై అవగాహన కల్పించారు.