News March 21, 2025
ADB: ACB కేసులో తప్పుడు సాక్ష్యం.. ముగ్గురిపై కేసు

కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పిన ముగ్గురి పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ ACB స్పెషల్ కోర్టు జడ్జీ తీర్పునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 2010లో లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) రేగుంట స్వామి కేసులో ఇచ్చోడ మండలానికి చెందిన కన్నమయ్య, నారాయణ, మల్లయ్య తప్పుడు సాక్ష్యం చెప్పారు. దీంతో వారిపై క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది.
Similar News
News January 6, 2026
‘ఆరోగ్య పాఠశాల’ అమలుపై కలెక్టర్ సమీక్ష

విద్యార్థుల శారీరక, మానసిక వికాసమే ప్రధాన లక్ష్యంగా జిల్లాలో ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఆరోగ్య పాఠశాలపై సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడమే ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.
News January 6, 2026
ఓటర్ల జాబితా రూపకల్పనలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్

రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో మున్సిపల్ ఎన్నికలు, ఓటర్ల జాబితా సవరణ, అభ్యంతరాల పరిష్కారంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఓటర్ల జాబితా కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
News January 6, 2026
నాగోబా జాతరకు రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం

ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ నాగోబా జాతర ఈనెల 18న ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కేస్లాపూర్ నాగోబా దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు తోపాటు సీఎం సలహాదారుడు నరేందర్ రెడ్డిలను హైదరాబాద్లో కలిశారు. ఈనెల 18న నాగోబా మహా పూజ, 22న దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. నాగోబా జాతరకు హాజరు కావాలని ఆహ్వాన పత్రం అందించారు.


