News February 11, 2025
ADB: FEB 18న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక

ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 18న సబ్-జూనియర్ జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రఘుపతి, రాష్ట్రపాల్ తెలిపారు. ఎంపికైన జిల్లా జట్టు వికారాబాద్ జిల్లాలోని 34వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. అర్హులైన క్రీడాకారులు పాల్గొనాలని సూచించారు.
Similar News
News April 11, 2026
ADB: కొత్త ‘మీసేవ’లకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో పౌర సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం కొత్త మీసేవ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఫ్రాంచైజీలు కేటాయించనుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.
News April 10, 2026
ADB: ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్

ADB జిల్లా కేంద్రంలోని శాంతినగర్లోని ఈవీఎం భద్రతా కేంద్రాన్ని (గోదాం) జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి నెలా నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన ఈ సందర్శన చేపట్టారు. ఈ సందర్భంగా గోదాం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
News April 10, 2026
ADB: టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులు బంద్

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులను అధికారులు నిలిపివేశారు. కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారానే రుసుము స్వీకరించనున్నారు. నిబంధన ఉల్లంఘించి నగదు ఇచ్చేవారు 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని రోలమామడ, గంజాల్ టోల్ ప్లాజాల వద్ద ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందుగానే ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


